యాప్నగరం

మేధావుల ఆలోచనలను కోల్పోతాం.. జగన్ సర్కార్‌పై పవన్ విమర్శలు

గతంలో వైఎస్సార్ పునరుద్ధరించిన శాసన మండలిని ఇప్పుడు రద్దును చేయడం సరికాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇలాంటి చర్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు.

Samayam Telugu 27 Jan 2020, 9:28 pm
రాష్ట్రంలో శాసన మండలి రద్దును జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖండించారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పునురుద్ధరించిన మండలిని ఇప్పుడు రద్దు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం (జనవరి 27) సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగ రూపకర్తలు ఎంతో ముందు చూపుతో రాష్ట్రాల్లో రెండు సభల ఏర్పాటుకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు.
Samayam Telugu Pawan Kalyan


Also Read: శాసన మండలి రద్దుపై గర్వపడుతున్నా: సీఎం జగన్

ఏదైనా ఒక బిల్లుపై శాసనసభలో పొరపాటు నిర్ణయం తీసుకున్నప్పుడు దానిపై పెద్దల సభలో మేధో మథనం చేసి వాటిని సరిదిద్దేందుకే మండలికి రూపకల్పన చేశారని పవన్ తెలిపారు. ఇంతటి ఉన్నతాశయాలతో ఏర్పాటు చేసిన మండలిని రాష్ట్రంలో రద్దు చేయడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థలను తొలగించుకుంటూ పోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు.

శాసన మండలి రద్దుకు ప్రజామోదం ఉందా? లేదా? అనే అంశాన్ని ప్రభుత్వం ఎక్కడా పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదని పవన్ విమర్శించారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులు మండలిలో నిలిచిపోయిన నేపథ్యంలో దాన్ని రద్దు చేయడం సహేతుకంగా అనిపించట్లేదని తెలిపారు. మండలి రద్దుతో మేధావుల ఆలోచనలను రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించే అవకాశాన్ని మనం కోల్పోయినట్లేనని పవన్ వ్యాఖ్యానించారు. శాసన మండలిని రద్దు చేసేంత పరిస్థితులేవీ రాష్ట్రంలో లేవని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.