యాప్నగరం

డాక్టర్లపై దాడులు చేస్తారా.. పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం

దేశంలో డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఎవరు పని చేయగలుగుతారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. డాక్టర్లకు జనసేన అండగా నిలుస్తుందన్నారు.

Samayam Telugu 21 Apr 2020, 1:25 pm
దేశవ్యాప్తంగా పలుచోట్ల డాక్టర్లు, వైద్య సిబ్బందిపై పలువురు దుండగులు దాడులకు తెగబడుతుండటాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రజల భద్రత కోసం ముందుండి పని చేస్తున్న వైద్యులపై ఎలా దాడులకు దిగుతారని ప్రశ్నించారు. ఈ మేరకు జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళవారం ట్వీట్ చేశారు.
Samayam Telugu pawan 2


‘‘డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే.. తమ విధులను ఎలా నిర్వర్తించగలుగుతారు? ఇలాంటి హేయమైన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. డాక్టర్ల పక్షాన జనసేన పార్టీ నాయకులు, జనసైనికులంతా నిలబడాల్సిన తరుణమిది’’ అని జనసేనాని పేర్కొన్నారు.

కాగా, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డాక్టర్లపై చోటుచేసుకుంటున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, లేకపోతే ఏప్రిల్ 23వ తేదీని బ్లాక్ డేగా ప్రకటిస్తామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బందికి తాము అండగా ఉంటామని జనసేనాని ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.