యాప్నగరం

Pawan Kalyan: రాజ్యసభ సీటు, కేంద్ర మంత్రి పదవి కోసం పట్టుబట్టిన పవన్‌.. ఎన్నికల ముందు మళ్లీ కెలికాడు!

Janasena: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై సినీ క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే జనసేన, బీజేపీ పొత్తుపై కూడా కాకరేపే వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 17 Apr 2021, 8:50 am

ప్రధానాంశాలు:

  • పవన్ ఫ్యాన్స్‌ను కూడా టార్గెట్ చేసిన కత్తి
  • బీజేపీ, జనసేన పొత్తుపై సంచలన వ్యాఖ్యలు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కెలకడం అంటే ఆయనకు అదో సరదా! ఒకానొక టైంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనపై దాడి చేసినా.. చివరికి చంపుతానని బెదిరించినా ఏ మాత్రం వెనక్కి తగ్గని నైజం. ఒక రకంగా చెప్పాలంటే, పవన్ కళ్యాణ్‌పై చేసిన విమర్శలతోనే వెలుగులోకి వచ్చి.. జనసేనాని అభిమానులు చేసిన రచ్చతో చివరికి, సెలబ్రిటీ హోదా కూడా దక్కించుకున్నాడు. చివరికి, పవన్ కళ్యాణ్ అభిమానులు జరుగుతున్న డ్యామేజీని గ్రహించి, ఎదురుదాడి తగ్గించినా.. ఆయన మాత్రం జనసేనానిపై పదునైన పంచ్‌లతో కాకరేపుతుంటారు! ఆయనే.. ప్రముఖ సినీ క్రిటిక్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల వ్యక్తి కత్తి మహేష్.
మరి కొద్ది గంటల్లో తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ జరగబోతున్న తరుణంలో కత్తి మహేష్ మరో సంచలన పోస్ట్ చేశారు. బీజేపీ- జనసేన పొత్తుకు ముప్పు వాటిల్లుతోందని వ్యాఖ్యానించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ తనకి రాజ్యసభ సీటు, కేంద్ర మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నారని కాకరేపే కామెంట్లు చేశారు. అయితే, ఈ విధంగా రూమర్స్ వస్తున్నాయని.. అది నిజం కాకూడదని కోరుకుందామని సెటైర్లు వేశారు!

‘‘తనకి రాజ్యసభ సీటు, మినిస్ట్రీ కావాలని పట్టుబట్టిన పవన్ కళ్యాణ్. తిరుపతిలో బీజేపీ-జనసేన పొత్తుకు ముప్పు.. అని రూమర్స్ వస్తున్నాయి. అది నిజం కాకూడదని కోరుకుందాం!’’ అని ఫేస్‌బుక్‌లో కత్తి మహేష్ సంచలన పోస్ట్ చేశారు. అయితే, ఈ పోస్టుపై ఓ జనసేన సానుభూతిపరుడు సెటైర్లు వేయగా.. ‘‘మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఆవేశమేగానీ ఆలోచన ఉండదే! కనీసం పూర్తిగా చదివాక రియాక్ట్ అవ్వొచ్చుగా!!’’ అంటూ మళ్లీ కత్తి మహేష్ కౌంటర్లు ఇచ్చారు.
ఇటీవలే జనసేన- బీజేపీ పొత్తు గురించి, పవన్ కళ్యాణ్ గురించి కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘పాచిపోయిన లడ్డుల్ని పవిత్రమైన లడ్డులని వెంకన్న సాక్షిగా అబద్ధం చెప్పలేక... తిరుపతిలో ప్రచారానికి రానన్న పవన్ కళ్యాణ్. గుర్రుగా సోము వీర్రాజు. వారిద్దరికీ నా అభినందనలు’ అంటూ బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్‌ భేటీ అయిన ఫొటోని షేర్ చేశారు కత్తి మహేష్. అంతటితో ఆగితే అది కత్తి మహేష్ ఎందుకు అవుతాడు.. పోస్ట్‌లలో ఇంకాస్త ఘాటు పెంచుతూ మరికొన్ని వదిలాడు.

‘పెళ్లంటూ చేసుకున్నాక కలుపుకెళ్లే పనిచూడాలిగానీ.. ప్రతిరోజూ కెలుకుడు యవ్వరాలేంది పవన్ కళ్యాణు? స్థానిక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశానికి కన్ను కొడితివి. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో రొమాన్స్ నడిపితివి. తిరుపతిలో సీటిచ్చి, ప్రచారం చెయ్యనంటే.. ఫస్ట్ నైట్ మంచమెక్కిన పెళ్ళాంతో సంసారం చెయ్యను అన్నట్టే కదా! అన్యాయం కదా పవనూ!!’ అంటూ పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేశాడు కత్తి మహేష్. దీంతో కత్తి మహేష్‌పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక, తిరుపతి ఉప ఎన్నికలో అధికార వైసీపీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని కత్తి మహేష్ విశ్లేషించారు. వైఎస్సార్ సీపీకి 60.76% ఓట్లు, టీడీపీకి 31.05%, బీజేపీ, జనసేన కూటమికి 6.09%, కాంగ్రెస్ పార్టీకి 1.19%, ఇతరులకు 0.84% ఓట్లు రావొచ్చని అభిప్రాయపడ్డారు. పోలయ్యే ఓట్ల శాతాన్ని బట్టి మెజారిటీ ఎంత వస్తుందో అంచానా వేయవచ్చని చెప్పారు. కాగా, శనివారం (ఏప్రిల్ 17వ తేదీ) తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.