యాప్నగరం

BJP ముద్దు, సొంత పార్టీ వద్దా..? జనసేనానీ ఇదేమీ..?

ఏపీలో బీజేపీ, జనసేన మధ్య దోస్తీ కుదిరిన సంగతి తెలిసిందే. ఇక నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా కలిసే నిర్వహించాలని ఇరు పార్టీలూ తీర్మానించాయి.

Samayam Telugu 24 Jan 2020, 8:25 pm
బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అమరావతి రైతులకు మద్దతుగా.. ఇరు పార్టీలు కలిసి ఫిబ్రవరి 2న భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించాయి. రాష్ట్రంలో ఏ కార్యక్రమం నిర్వహించినా రెండు పార్టీలూ కలిసే చేపట్టాలని కూడా తీర్మానించాయి. బీజేపీతో దోస్తీ కుదిరాక పవన్ కళ్యాణ్‌లో దూకుడు పెరిగింది. జగన్ సర్కారు మీద ఆయన ఘాటైన విమర్శలు చేస్తున్నారు. కమలం పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత బయటే కాదు.. సోషల్ మీడియా పరంగానూ జనసేనాని వైఖరిలో మార్పు వచ్చింది.
Samayam Telugu bjp pk jsp


నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళులు అర్పిస్తూ.. ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌ను పవన్ కళ్యాణ్ రీ ట్వీట్ చేశారు. తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతోపాటుగా బీజేపీని ఫాలో అవుతున్నారు. గతంలో ఆయన కేవలం మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను మాత్రమే ట్విట్టర్లో ఫాలో అయ్యేవారు. అనంతరం వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్‌ను ఫాలో అయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మోదీ, అమిత్ షా, భారతీయ జనతా పార్టీ వచ్చి చేరాయి.

పవన్ ఫాలో అవుతున్నది వీరినే..

పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని గమనించారో లేదోగానీ.. తన సొంత పార్టీ జనసేనను మాత్రం ఆయన ట్విట్టర్లో ఫాలో కావడం లేదు. బీజేపీని అనుసరించే ముందు జనసేనను కూడా ఫాలో చేస్తే బాగుండేది. జనసేన మాత్రం ట్విట్టర్లో కేవలం పవన్ కళ్యాణే ఫాలో అవుతుంది. అదే సమయంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ ట్విట్టర్ హ్యాండిల్‌ జనసేనను, చంద్రబాబును ఫాలో అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఫాలో కావడం లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.