యాప్నగరం

Pawan Kalyan: ప్రత్యేక హోదా, కమ్యూనిస్టులపై జనసేనాని ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న అనంతరం ప్రత్యేక హోదా విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టులకు నేనేమైనా బాకీ ఉన్నానా అని ఆయన నవ్వుతూ వ్యాఖ్యానించారు.

Samayam Telugu 16 Jan 2020, 4:10 pm
జనసేన, బీజేపీ సంయుక్త మీడియా సమవేశంలో ప్రత్యేక హోదా విషయమై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో స్పష్టత ఇవ్వాలని గతంలో తాను ప్రధానిని కోరానన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదానే కోరుకుంటే.. స్పెషల్ ప్యాకేజీ తీసుకోకుండా ఉండాల్సిందన్న పవన్.. టీడీపీ దీనికి బాధ్యత వహించాలన్నారు. ‘‘హోదా గురించి అడగాల్సింది 20కిపైగా ఎంపీలున్న వైసీపీని, ముగ్గురు ఎంపీలున్న టీడీపీని. హోదా కోసం మేం చేయాల్సిన పోరాటాలన్నీ చేశాం. నిలబడాల్సినంత నిలబడ్డాం. ఏపీ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ సహకరిస్తున్నారు. కానీ ఏపీ రాజకీయాల్లో కులతత్వం, అవినీతి, కుటుంబపాలన పోవాలి. ప్రత్యేక హోదా గురించి వైసీసీని అడగండి, టీడీపీని అడగండి’’ అని పవన్ వ్యాఖ్యానించారు.
Samayam Telugu pawan


2019 ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. వామపక్షాలకు నేనేమైనా బాకీ ఉన్నానా..? అంటూ పవన్ నవ్వుతూ బదులిచ్చారు. వామపక్షాల కంటే ముందు నేను బీజేపీతో కలిసి పని చేసిన విషయం మర్చిపోవద్దన్నారు.

ఒక ఊళ్లో హైకోర్టు పెడితే దాన్ని రాజధాని అనరన్న పవన్.. మూడు రాజధానులు అనేది మభ్యపెట్టే విధానమన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి రాయలసీమకు రాజధాని వచ్చిందనడం మాత్రం తప్పున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.