యాప్నగరం

పవన్ పెద్ద మనసు.. జనసేన ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన శిబిరాలు

రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జనసేన ఆధ్వర్యంలో ‘డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు’పేరిట ఉచితంగా అన్నదానం. మంగళగిరిలో ప్రారంభించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Samayam Telugu 15 Nov 2019, 10:27 am
జనసేన పార్టీ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాలను ప్రారంభమయ్యాయి. శుక్రవారం అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మంగళగిరిలో శ్రీకారం చుట్టారు. పవన్ స్వయంగా భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం చేశారు. జనసేన ఆధ్వర్యంలో ‘డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు’పేరిట రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తోంది. ఈ శిబిరాల ద్వారా భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా ఆహారం అందించనున్నారు.
Samayam Telugu pawan kalyan


భవన నిర్మాణ కార్మికుల ఆకలి ప్రభుత్వానికి తెలిపేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వం 50మంది కార్మికులను చంపేసిందని.. తక్షణమే భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలి అన్నారు. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారని.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నామన్నారు. తాను వ్యక్తిగతంగా ఎవర్నీ విమర్శించనని.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నానని చెప్పారు. ఇప్పటికైనా కార్మికుల కష్టాలను సీఎం జగన్ పట్టించుకోవాలి అని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇసుక కొరతతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారంటూ జనసేన పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పటికే విశాఖలో లాంగ్‌మార్చ్ పేరుతో భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. అంతేకాదు గవర్నర్‌ను కలిసి భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందుల్ని వివరించి.. వినతిపత్రం అందించారు. తాజాగా డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ప్రారంభించింది జనసేన.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.