యాప్నగరం

YSRCP ఎంపీపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

తన పుట్టిన రోజు నాడు శుభాకాంక్షలు తెలిపిన అందరికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎంపీపై ప్రశంసలు కురిపించారు.

Samayam Telugu 3 Sep 2020, 8:39 am
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం తన పుట్టిన రోజు జరుపుకున్నారు. జనసేనానికి అన్ని రంగాల ప్రముఖులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కొంతమంది సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇదిలా ఉంటే తన పుట్టిన రోజు నాడు శుభాకాంక్షలు తెలిపిన అందరికి పవన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎంపీపై ప్రశంసలు కురిపించారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్


Read Also: వైఎస్ వర్ధంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే రోజా దూరం.. కారణం ఏంటంటే!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొగిడేశారు. పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపినందుకు రఘురామరాజు‌కు జనసేన అధినేత ధన్యవాదాలు తెలిపారు. అలాగే దేవాలయాలు, వారసత్వంగా ఉన్న సంపదనను కాపాడేందుకు ఆయన పడుతున్న శ్రమకు అభినందనలు తెలియజేశారు.

Also Read: నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్.. మళ్లీ హైకోర్టులో రమేష్‌కుమార్ పిటిషన్

నర్సాపురం ఎంపీ గతంలో టీటీడీ ఆస్తులు అమ్మాలని ప్రభుత్వం భావించిందని తెలియడంతో స్పందించారు. అధికార పార్టీకి చెందిన ఎంపీ అయినా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తిరుమల శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన భూములు, ఆస్తులు విక్రయిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని సూచించారు. కానీ తర్వాత ప్రభుత్వం టీటీడీ ఆస్తుల్ని అమ్మడం లేదని క్లారిటీ ఇచ్చింది.

Must Read: విశాఖ మన్యంలో అంతు చిక్కని వ్యాధి.. వారం వ్యవధిలో ముగ్గురు మృతి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.