యాప్నగరం

AP Capital: 3 రాజధానులపై పవన్ స్పందన.. మళ్లీ అలాగే!

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని జగన్ చేసినన వ్యాఖ్యల పట్ల జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇప్పటి వరకూ అమరావతికే దిక్కూ దివాణం లేదు.. మూడు అమరావతి నగరాల నిర్మాణం సాధ్యమయ్యేనా? అని ప్రశ్నించారు.

Samayam Telugu 17 Dec 2019, 10:17 pm
ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చంటూ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తినడానికే మెతుకులు లేక అయ్య ఏడుస్తుంటే... కొడుకొచ్చి పరమాన్నం అడిగినట్టుగా జగన్ సర్కారు నిర్ణయం ఉందని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకూ ఒక్క అమరావతి రాజధాని నిర్మాణానికే దిక్కూ దివాణం లేదు.. మరి జగన్ రెడ్డి మూడు అమరావతి నగరాలు సాధ్యమయ్యేనా? అని ప్రశ్నించారు.
Samayam Telugu pawan


రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనిశ్చితి, అశాంతి, అభద్రత తప్ప పాలకుల వల్ల ఒరిగిందేం లేదని పవన్ విమర్శించారు. కమిటీ రిపోర్ట్ రాకముందే.. మూడు రాజధానులు ప్రకటించే కాడికి.. అసలు కమిటీలు వెయ్యడం దేనికి? నిపుణుల్ని అపహాస్యం చేయడం దేనికి? అని పవన్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.

Read Also: ఏపీకి మూడు రాజధానులు కరెక్ట్ కాదు.. ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ

‘‘ప్లీనరీలో అమరావతికి ఓకే అన్నందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతారా?. మాట తప్పను.. మడమ తిప్పను అంటే ఇదేనా?. కేంద్రం అమరావతిని గుర్తించింది. మ్యాప్‌లో మార్పు చేసింది. ఏపీ నూతన రాజధానిగా కేంద్రం నోటిఫై చేయాలంటే మూడు ప్రాంతాల్లో దేన్ని నోటిఫై చేయాల’’ని పవన్ ప్రశ్నించారు.
‘హైకోర్ట్ కర్నూల్‌లో ఉంటే శ్రీకాకుళం నుండి కర్నూల్ కి వెళ్లాలా ? అనంతపురం నుండి ఉద్యోగులు విశాఖపట్నం వెళ్లి ఉద్యోగాలు చేయాలా? సామాన్య ప్రజలకు ఏదైనా కోర్టు, లేదా సెక్రటేరియట్ లో పని ఉంటే వెళ్ళటం సాధ్యమయ్యే పనేనా ?’ అని పవన్ ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.