యాప్నగరం

జగన్ రెడ్డి గారూ అలా చేయొద్దు.. పవన్ రిక్వెస్ట్

ఇంగ్లీషు భాషని వద్దని ఎవరు చెప్పటం లేదు కానీ.. తెలుగుని మృత భాషగా కాకుండా ఏమి చర్యలు తీసుకుంటారో వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి గారు చెప్పాలి. మాతృభాషని, మాండలీకాలని సంరక్షించాల్సిన ప్రథమ బాధ్యత ప్రభుత్వానిదే’

Samayam Telugu 19 Nov 2019, 10:12 am
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ట్విట్టర్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను టార్గెట్ చేశారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రోజు నుంచి ఏపీ సీఎంపై రెచ్చిపోతున్నారు. ఇసుక కొరత, జగన్ పాలనతో పాటూ మరికొన్ని అంశాలపై.. వరుసగా నాలుగు రోజులగా వరుస ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై స్పందించిన పవన్.. సీఎం జగన్‌కు ప్రత్యేకంగా విజ్ఞ‌ప్తి చేశారు. మాతృ భాషని ,మృత భాషగా మార్చకండి అన్నారు.. భాష సరస్వతిని అవమానించకంండి అన్నారు.
Samayam Telugu pawan.


‘ఇంగ్లీషు భాషని వద్దని ఎవరు చెప్పటం లేదు కానీ.. తెలుగుని మృత భాషగా కాకుండా ఏమి చర్యలు తీసుకుంటారో వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి గారు చెప్పాలి. మాతృభాషని, మాండలీకాలని సంరక్షించాల్సిన ప్రథమ బాధ్యత ప్రభుత్వానిదే.. మాతృ భాషని ,మృత భాషగా మార్చకండి. తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు పేపర్ నడుపుతూ,తెలుగుని చంపేసే ఆలోచన ,భస్మాసుర తత్వాన్ని సూచిస్తుంది. జగన్ రెడ్డి గారు.. మా తెలుగు తల్లి అని పాడాల్సిన మీరు.. తెలుగు భాష తల్లినే చంపేస్తున్నారు. జగన్ రెడ్డి గారు భాష సరస్వతిని అవమానించకండి’ అంటూ వరుసగా ట్వీట్‌లు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.