యాప్నగరం

పంచాయతీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

పంచాయతీ ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ సాకు సరైంది కాదని.. కరోనా సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలు పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.

Samayam Telugu 23 Jan 2021, 1:56 pm
ఏపీ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.. జిల్లాలవారీగా వివరాలను ఎస్ఈసీ ప్రకటించింది. ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పంచాయతీ ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ సాకు సరైంది కాదని.. కరోనా సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలు పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారని గుర్తు చేశారు. ఎన్నికలపై కోర్టుకు ఎన్నిసార్లు వెళ్తారని.. ఎస్ఈసీ నిమ్మగడ్డ, జడ్జిలను కులాల పేరుతో దూషించారన్నారు. వ్యాక్సిన్ ఆరోగ్య సిబ్బందితో పాటూ ఉద్యోగులకు ఇవ్వాలని.. ఉద్యోగ సంఘాలు ఎన్నికలకు సహకరించాలన్నారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్


ప్రభుత్వం మాత్రం ఎన్నికల నిర్వహణకు సుముఖంగా లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహణ కష్టమని.. కరోనా వ్యాక్సిన్ ప్రక్రియకు ఇబ్బందులు ఎదురవుతాయంటోంది. ఇటు ఉద్యోగ సంఘాలు కూడా విధులకు దూరం అంటున్నారు. కరోనా వ్యాక్సిన్ ఇచ్చే వరకు ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని తేల్చి చెప్పారు. అధికారులపై చర్యలు తీసుకుంటామని.. నిమ్మగడ్డ బెదిరించడం న్యాయం కాదన్నారు. ఉద్యోగులు మాత్రం ప్రాణాలు బలి పెట్టాలా అని ప్రశ్నించారు.. సుప్రీంకోర్టులో ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేశామంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.