యాప్నగరం

దిశ చట్టం ఏమైంది.. వాళ్లను వదలొద్దు: పవన్ కళ్యాణ్

మహిళలపై అత్యాచారాలు నిరోధానికి తీసుకువచ్చిన దిశ చట్టం ఏమైపోయింది.. అసెంబ్లీలో ముక్తకంఠంతో ఆమోదం పొందిన ఆ చట్టం ఇంకా ఎందుకు అమలు కావడం లేదు. దిశ పేరుతో ఏర్పాటైన ఆ ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లు ఏం చేస్తున్నాయని పవన్ కళ్యాణ్ ప్రశ్నలు.

Samayam Telugu 20 Jul 2020, 11:50 am
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్యాంగ్ రేప్ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని.. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. కుటుంబ పోషణ కోసం ఓ దుకాణంలో పని చేస్తున్న 16ఏళ్ల బాలికపై కొందరు కామాంధులు సామూహిక అత్యాదారానికి ఒడిగట్టిన ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. అమానుషకరమైన ఈ ఘటన హృదయం ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తుందని.. నాలుగు రోజులపాటు చిత్ర హింసలకు గురి చేసిన ఆ మృగాళ్లను కఠినంగా శిక్షించాలి అన్నారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్


తన కుమార్తె ఆచూకీ తెలియడం లేదని తల్లి పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసిన సకాలంలో స్పందించలేదని తెలిసిందన్నారు పవన్. మహిళలపై అత్యాచారాలు నిరోధానికి తీసుకువచ్చిన దిశ చట్టం ఏమైపోయింది.. అసెంబ్లీలో ముక్తకంఠంతో ఆమోదం పొందిన ఆ చట్టం ఇంకా ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. తొలి దిశ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటైన రాజమహేంద్రవరంలో సామూహిక అత్యాచార ఘటన జరిగిందని.. దిశ పేరుతో ఏర్పాటైన ఆ ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లు ఏం చేస్తున్నాయన్నారు.
ఈ సామూహిక అత్యాచారం వెనక గంజాయి, డ్రగ్స్‌ ముఠాలు ఉన్నాయనీ.. ఇది బ్లేడ్‌ బ్యాచ్‌ పనే అని ఆ నగరవాసులు ఆందోళన చెందుతున్న విషయాన్ని పోలీస్‌ అధికారులు పరిగణనలోకి తీసుకోవాలి అన్నారు. అలాంటి ముఠాల ఆగడాలకు కళ్ళెం వేయకపోతే రక్షణ కరవవుతుందని.. చట్టం చేయడం కాదు.. వాటిని నిబద్ధతతో అమలు చేస్తేనే మహిళలకు రక్షణ కలుగుతుంది అన్నారు జనసేనాని.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.