యాప్నగరం

ఆ అవసరం ఎందుకు వచ్చిందో జగన్ సర్కార్ చెప్పాలి: పవన్

టీటీడీ భూములను లీజుకు ఇవ్వొచ్చని.. వాణిజ్య ప్రయోజనాల కోసం అభివృద్ధి చేయాలన్నారు పవన్. యాజమాన్య హక్కులను కోల్పోకుండా ఆదాయాన్ని సంపాదించడంపై ఎందుకు దృష్టి పెట్టరని ప్రశ్నించారు.

Samayam Telugu 25 May 2020, 1:00 pm
ఏపీలో టీటీడీ భూముల అమ్మకంపై రగడ కొనసాగుతోంది. ముఖ్యంగా విపక్షాలు జగన్ సర్కార్‌ను టార్గెట్ చేశాయి.. టీటీడీ నిర్ణయంపై మండిపడుతున్నాయి. తాజగా ఈ అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. టీటీడీ ఆస్తులను అమ్మే అవసరం ఎందుకు వచ్చిందో చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ ఆస్తుల అమ్మకంపై ప్రభుత్వం, టీటీడీ ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్


టీటీడీ భూముల్ని అమ్మితే తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని.. మిగిలిన హిందూమత సంస్థలు దీనిని అనుసరించే ప్రమాదం లేకపోలేదు అన్నారు పవన్. విభజన తర్వాత ఏపీ ఇబ్బందులు పడుతోందని.. రాష్ట్రానికి పూర్తి స్థాయి రాజధాని లేదని.. ఆర్థిక పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందన్నారు. ఏపీకి పెట్టబడులు కావాలని.. ఉద్యోగ అవకాశాలను సృష్టించగలగాలని.. ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిలో పడేలా చూడాలన్నారు. ఏపీ ప్రభుత్వానికైనా భూమి పెద్ద ఆదాయవనరు.. భూములతో పెట్టబడుల్ని ఆకర్షించొచ్చని.. అలాగే విలువ పెంచుకోవచ్చన్నారు. భూముల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని.. ప్రభుత్వం భూముల్ని, ఆస్తుల్ని కాపాడుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలన్నారు.
ప్రభుత్వ ఆస్తుల్ని, భూమిని రక్షించడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాలని.. భక్తుల మనోభావాలను, నమ్మకాన్ని దెబ్బతీయడం సరి కాదన్నారు జనసేనాని. భవిష్యత్తులో రాష్ట్రానికి ఆర్థిక అవకాశాలను పణంగా పెట్టడం సరికాదని.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం టీటీడీ భూములను అమ్మేందుకు అనుమతిస్తే అది చాలా పెద్ద తప్పన్నారు. కొన్ని కీలకమైన అంశాలను కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
Please Vote: పోల్: జగన్ ఏడాది పాలన ఎలా ఉంది?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.