యాప్నగరం

ఢిల్లీలో జగన్‌ పరిస్థితి ఇది.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్

‘175 అసెంబ్లీ స్థానాలున్న అం.ప్ర - అసెంబ్లీ లో 151 అసెంబ్లీ స్థానాలలో ప్రజలు గెలిపిస్తే , వచ్చిన ఐదు నెలలు లోనే 35 లక్షల భవన నిర్మాణ కార్మికుల ఉపాధి ని తీసివేసి -ఏభై మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘనత వైసీపీకే దక్కింది’

Samayam Telugu 16 Nov 2019, 10:39 am
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లిన జనసేనాని.. పలువురు ప్రముఖుల్ని కలిశారు. అలాగే కేంద్రమంత్రులతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితిలు.. ముఖ్యంగా ఏపీలో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు.. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై చర్చించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Samayam Telugu cm.


ఇదిలా ఉంటే పవన్ హస్తిన పర్యటనపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక వైఎస్సార్‌సీపీ అయితే జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారని.. అందుకే ఢిల్లీకి వెళ్లారని ఎద్దేవా చేస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి ట్విట్టర్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ టార్గెట్‌గా ట్వీట్‌తో విరచుకుపడ్డారు. ఢిల్లీలో జగన్ పరిస్థితి ఇది అంటూ ఓ ఫోటోను ట్వీట్ చేశారు. కాళ్లకు ఇసుక బస్తాలు కట్టుకొని సీఎం నడుస్తున్న ఫోటోను ట్వీట్ చేశారు. ఢిల్లీలో జగన్‌పై ఇలాంటి అభిప్రాయమే ఉందన్నారు.

అంతేకాదు‘175 అసెంబ్లీ స్థానాలున్న అం.ప్ర - అసెంబ్లీ లో 151 అసెంబ్లీ స్థానాలలో ప్రజలు గెలిపిస్తే , వచ్చిన ఐదు నెలలు లోనే 35 లక్షల భవన నిర్మాణ కార్మికుల ఉపాధి ని తీసివేసి -ఏభై మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘనత వైసీపీకే దక్కింది’అన్నారు జనసేన అధినేత.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.