యాప్నగరం

YS Jaganపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Janasena Party| మన మీద కేసులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కాపాడటానికి ధైర్యం సరిపోదు.. ఏదన్నా మాట్లాడదామంటే సీబీఐ కేసులు అని మనకంటే పైవాళ్లు చెప్పినప్పుడు.. రాష్ట్రానికి నీళ్లు రావాలన్నా.. ప్రాజెక్టులు రావాలన్నా.. మన మీద కేసులు ఉంటే బలంగా మాట్లాడలేరు.

Samayam Telugu 23 Oct 2019, 6:56 pm
తాను ముఖ్యమంత్రి అవ్వాలనే పగటి కలలు కనడం లేదన్నారు జనసేనాని. 25 ఏళ్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం పార్టీని పెట్టానని.. ప్రజల కష్టాల గురించి మాట్లాడతాను అన్నారు. తాను సినిమాలు చేసుకుంటూ ఆనందంగా ఉండేవాడినని.. కానీ ప్రజలకు ఏదైనా చెయ్యాలనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ప్రజల కోసం నిలబడదామనుకుంటున్నానని.. గెలుస్తానో.. ఓడతానో తెలియదు.. అంతిమ శ్వాస వరకు పార్టీని నడుపుతాను అంటున్నారు పవన్. తాను తల ఎవరికీ వంచను.. మనుషుల్ని గౌరవిస్తానని చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోగానే బెంబేలు పడే వ్యక్తిని కాదని.. తనతో పాటూ 25 ఏళ్లు ప్రయాణించే వాళ్లు కావాలి అన్నారు.
Samayam Telugu pawan


Read Also: నాకు కొడుకు ఉంటే బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డిలా.. వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

పార్టీల కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టకూడదన్నారు జనసేన అధినేత. ఇందుకు ఉదాహరణ చెబుతూ.. ‘వైసీపీ నేతలు ఢిల్లీకి వెళితే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదట.. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్, జోషి అపాయింట్‌మెంట్ దొరకలేదు. మన మీద కేసులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కాపాడటానికి ధైర్యం సరిపోదు.. ఏదన్నా మాట్లాడదామంటే సీబీఐ కేసులు అని మనకంటే పైవాళ్లు చెప్పినప్పుడు.. రాష్ట్రానికి నీళ్లు రావాలన్నా.. ప్రాజెక్టులు రావాలన్నా.. మన మీద కేసులు ఉంటే బలంగా మాట్లాడలేరు. నాపైస్థాయి వ్యక్తుల దగ్గర ప్రజా హక్కుల గురించి మాట్లాడలేం. అలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రలు అయితే ఎంత న్యాయం జరుగుతుందన్నది సందేహమే’అంటూ పరోక్షంగా సీఎం జగన్‌పై విమర్శలు చేశారు.

తనకు జగన్, చంద్రబాబు వ్యక్తిగతంగా విభేదాలు లేవు అన్నారు పవన్. వాళ్లు ఏం చేసినా తాను పట్టించుకోనని.. కానీ ప్రజలకు ఇబ్బందులు వచ్చినప్పుడు స్పందిస్తాను అన్నారు. జగన్ సొంత చిన్నాన్న వివేకాను చంపితే టీడీపీవాళ్లు చేయించిందని వైఎస్సార్‌సీపీ నేతల ఆరోపించారని గుర్తు చేశారు. అలాగే జగన్‌పై కోడి కత్తితో దాడి విషయంలోనూ.. ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్నారని.. సీబీఐ విచారణ కోరారన్నారు. ఇప్పుడు వాళ్ల పార్టీ అధికారంలోకి వచ్చిందని.. విచారణ చేసి.. దోషుల్ని పట్టుకోవచ్చు కదా అంటూ ప్రశ్నించారు పవన్.

ఇవన్నీ వైఎస్సార్‌సీపీవాళ్లు మర్చిపోయేరేమో కానీ.. తాను మాత్రం మర్చిపోను అన్నారు పవన్ కళ్యాణ్. నెల్లూరు జిల్లాలో మహిళా అధికారిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే దాడి చేశారని.. ఇటు తూర్పుగోదావరి జిల్లాలో జర్నలిస్ట్ హత్య కేసులోనూ మరో ఎమ్మెల్యేపైనా ఆరోపణలు వచ్చాయని.. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి అన్నారు. తాను మాత్రం పిరికితనంగా బతకలేనని.. ప్రజలకు వచ్చే కష్టాలపై స్పందిస్తానన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.