యాప్నగరం

హిందూ రాజకీయ నాయకుల వల్లే.. పవన్ సంచలన వ్యాఖ్యలు

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హిందూ రాజకీయ నాయకులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజించి పాలించేందుకు మత విద్వేషాలు సృష్టించేది వారేనంటూ ఆయన వ్యాఖ్యానించారు.

Samayam Telugu 3 Dec 2019, 10:03 am
మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిలో హిందూ నాయకులే ఎక్కువగా ఉంటారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి, చిత్తూరు పర్యటనలో ఉన్న పవన్ పార్టీ శ్రేణులతో సమావేశంలో మాట్లాడారు. మత రాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నాయకులేనన్నారు. విభజించి ఓట్ల రాజకీయం చేస్తున్నారని.. అందుకే గొడవలు పెడతారని వ్యాఖ్యానించారు.
Samayam Telugu Jana Sena Pawan Kalyan


Read Also: ఖబర్దార్ పవన్ కళ్యాణ్.. ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్

మత గొడవలు పెట్టేది హిందూ నాయకులే కానీ మిగిలిన వారు కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. లౌకికవాదానికి తూట్లు పొడిచింది కూడా హిందూ నాయకులేనని ఆయన ఆరోపించారు. టీటీడీలో అన్యమత ప్రచారం చేయిస్తోంది కూడా హిందువులేనని.. హిందూ నాయకుల ప్రేరణ లేకుండా ఇలాంటివి జరగవన్నారు. అన్యమత ప్రచారం వివాదం ఎందుకు వస్తుందని ఆయన ప్రశ్నించారు. అక్కడ చేయకూడదని స్పష్టం చెబితే అధికారులు చూసుకుంటారన్నారు.

Also Read: నేను ఇద్దరు ఆడబిడ్డల తండ్రిని.. ‘దిశ’ ఘటనపై పవన్ సంచలన వ్యాఖ్యలు

చిన్నప్పటి నుంచి వింటున్న సెక్యులరిజాన్ని ఎక్కువ ఇబ్బందులు పెట్టింది కూడా హిందూ రాజకీయ నాయకులేనని ఆయన అన్నారు. తన వ్యాఖ్యలు చాలా మందిని ఇబ్బంది పెడతాయని తెలుసన్న పవన్.. సత్యం మాట్లాడుతున్నానని చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని.. తన వాదన బలంగా వినిపిస్తానని ఆయన అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.