ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డా.. జగన్ ప్రభుత్వంలో స్పందన లేదని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సాయం చేయడంలోనూ కుల కోణం ఏంటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో 80 శాతం వరి కౌలు రైతుల సేద్యం నుంచి వస్తున్నదే అని అన్నారు. రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీతో గురువారం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కౌలు రైతుల స్థితిగతులపై పవన్కు ప్రతినిధులు నివేదిక అందజేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇటీవల చనిపోయిన బిడ్డను తరలించేందుకు అంబులెన్స్ అడిగితే ఇవ్వని పాషాణ ప్రభుత్వమని ఇదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆస్పత్రులను మెరుగుపరచని వైసీపీ పెద్దలు, విశాఖను రాజధానిగా అభివృద్ధి చేసేస్తారట అని ఎద్దేవా చేశారు. బిడ్డ మృతదేహంతో 120 కిలో మీటర్ల దూరం మోటార్ సైకిల్పై వెళ్లిన ఆ గిరిజన దంపతులకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేజీహెచ్లో గిరిజనులకు సాయపడేందుకు ఎస్టీ సెల్ ఉన్నా, ఆస్పత్రిలో ఉన్నతాధికారులు ఉన్నా పట్టించుకోకపోవడం అమానవీయమన్నారు.
ఆస్పత్రుల నిర్వహణ, ప్రజారోగ్యంపై పాలకులు ఎంత శ్రద్ధ చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ తరహా ఘటన మన రాష్ట్రంలో మొదటిది కాదని, కొద్ది నెలల క్రితమే తిరుపతి రుయా ఆస్పత్రి నుంచి బిడ్డ మృతదేహాన్ని తరలించేందుకు ఓ తండ్రి పడ్డ ఆవేదనను రాష్ట్ర ప్రజలు మరచిపోలేదన్నారు. మచిలీపట్నం సముద్రతీరంలో ఓ బాలుడు చనిపోతే ఆ బిడ్డ మృతదేహాన్ని బంధువులు బైక్ మీద తీసుకువెళ్లారని, ఆస్పత్రుల్లో ఉన్న మహాప్రస్థానం వాహనాల పథకం ఏమైందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇటీవల చనిపోయిన బిడ్డను తరలించేందుకు అంబులెన్స్ అడిగితే ఇవ్వని పాషాణ ప్రభుత్వమని ఇదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆస్పత్రులను మెరుగుపరచని వైసీపీ పెద్దలు, విశాఖను రాజధానిగా అభివృద్ధి చేసేస్తారట అని ఎద్దేవా చేశారు. బిడ్డ మృతదేహంతో 120 కిలో మీటర్ల దూరం మోటార్ సైకిల్పై వెళ్లిన ఆ గిరిజన దంపతులకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేజీహెచ్లో గిరిజనులకు సాయపడేందుకు ఎస్టీ సెల్ ఉన్నా, ఆస్పత్రిలో ఉన్నతాధికారులు ఉన్నా పట్టించుకోకపోవడం అమానవీయమన్నారు.
ఆస్పత్రుల నిర్వహణ, ప్రజారోగ్యంపై పాలకులు ఎంత శ్రద్ధ చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ తరహా ఘటన మన రాష్ట్రంలో మొదటిది కాదని, కొద్ది నెలల క్రితమే తిరుపతి రుయా ఆస్పత్రి నుంచి బిడ్డ మృతదేహాన్ని తరలించేందుకు ఓ తండ్రి పడ్డ ఆవేదనను రాష్ట్ర ప్రజలు మరచిపోలేదన్నారు. మచిలీపట్నం సముద్రతీరంలో ఓ బాలుడు చనిపోతే ఆ బిడ్డ మృతదేహాన్ని బంధువులు బైక్ మీద తీసుకువెళ్లారని, ఆస్పత్రుల్లో ఉన్న మహాప్రస్థానం వాహనాల పథకం ఏమైందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.