యాప్నగరం

వాళ్లని కుక్కలతో పోల్చిన పవన్ కళ్యాణ్.. ఒక్క మాటతోనే, దిమ్మతిరిగేలా..!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. వైసీపీ నేతలను ‘కుక్క’లతో పోలుస్తూ మండిపడ్డారు.

Samayam Telugu 27 Sep 2021, 11:26 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన పవన్ కళ్యాణ్.. జగన్ సర్కార్‌పై ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు. దీంతో ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యే ఎదురు దాడికి దిగారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్


ఈ నేపథ్యంలో వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు జనసేనాని సోమవారం ట్వీట్ చేశారు. వైసీపీ నాయకులను ‘కుక్క’లతో పోలుస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలను గ్రామ సింహాలు అంటూ సంబోధించిన పనవ్ కళ్యాణ్.. కుక్కలుగా అభివర్ణించారు.

‘‘తుమ్మెదల ఝుంకారాలు.. నెమళ్ళ క్రేంకారాలు. ఏనుగుల ఘీంకారాలు.. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే..’’ అంటూ పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు.


ఇక, ఏపీలో ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రుద్దుతోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదని.. సంక్షేమం అసలే కాదన్నారు. ఈ మేరకు పవన్‌ ట్వీట్‌ చేశారు. ‘నేటి నవరత్నాలు.. భావితరాలకు నవ కష్టాలు’ అని ఆయన ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వం చేసిన వాగ్దానాలు.. వాటిని అమలు చేయడంలో కనిపిస్తున్న కటిక నిజాలు పేరిట #SaveAPfromYSRCP హ్యాష్‌ ట్యాగ్‌తో ట్వీట్‌ పోస్ట్‌ చేశారు. వైకాపా ఇచ్చిన హామీలు.. ప్రభుత్వం చేస్తున్న చర్యలను వివరిస్తూ పవన్‌ ట్వీట్‌ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.