యాప్నగరం

పవన్ కళ్యాణ్ సింప్లిసిటీ.. ఫోటోలు వైరల్

కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష తర్వాత పవన్ కళ్యాణ్ సింప్లిసిటీ.. ఓ అరుగుపై పడుకొని సేద తీరిన జనసేనాని. విమానాశ్రాయానికి వెళుతూ మధ్య కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న పవన్ కళ్యాణ్.

Samayam Telugu 13 Dec 2019, 9:28 am
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన సింప్లిసిటీతో కనిపించారు. అలసటతో ఓ అరుగుపై పడుకొని విశ్రాంతి తీసుకొన్నారు.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనసేనాని గురువారం కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష చేశారు. సాయంత్రం దీక్ష ముగిసిన తర్వాత రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయానికి బయల్దేరారు.
Samayam Telugu pawan.


పవన్ ఎయిర్‌పోర్ట్‌‌కు వెళ్లే సమయంలో విమానం ఆలస్యం అవుతుందని సమాచారం వచ్చింది. దీంతో మార్గ మధ్య ఓ జనసేన కార్యకర్త ఇంటి దగ్గర కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ ఇంట్లో అరుగుపై పడుకొని తల కింద చిన్న దిండు పెట్టుకొని.. పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ విమానాశ్రయానికి బయల్దేరి వెళ్లిపోయారు.

పవన్ కళ్యాణ్ ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారాయి. పవన్ కళ్యాణ్ సింప్లిసిటీకి జనసైనికులు, అభిమానులు ఫిదా అవుతున్నారు. ఓ పార్టీకి అధ్యక్షుడు, సినిమా హీరో అనే గర్వం లేకుండా చాలా సాదాసీదాగా ఉంటారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.