యాప్నగరం

తమిళనాడులో చిక్కుకున్న మత్స్యకారులు.. పవన్ కళ్యాణ్ స్పెషల్ రిక్వెస్ట్

AP Fishermen Lockdown in Chennai: శ్రీకాకుళం జిల్లాకు చెందిన 30 మంది మత్స్యకారులు చెన్నై హార్బర్ వద్ద చిక్కుకుపోయారని, వారిని ఆదుకోవాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ కోరారు.

Samayam Telugu 30 Mar 2020, 12:01 am
కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న తరుణంలో ఏపీకి చెందిన మత్స్యకారులు చేపల వేట కోసం తమిళనాడుకు వెళ్లి చిక్కుకుపోయారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఆయ ట్వీట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సీహెచ్ చొలగండి గ్రామం నుంచి చేపల వేట కోసం 30 మంది మత్స్యకారులు తమిళనాడు తీర ప్రాంతానికి వెళ్లారని తెలిపారు.
Samayam Telugu pawan 9


అయితే మంది లాక్ డౌన్ వల్ల వారంతా చెన్నై హార్బర్ దగ్గర చిక్కుకుపోయారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆ మత్స్యకారులకు అక్కడ వసతి, భోజనం లేక ఇబ్బందులు పడుతుండటంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయని తెలిపారు. జనసేన నాయకుల ద్వారా తనకు ఈ సమాచారం తెలిసిందన్నారు.

Also Read: ఇంకా క్యూలు ఏంటి.. గ్రామ వలంటీర్లపై పవన్ కళ్యాణ్ విమర్శలు

చెన్నై హార్బర్‌ దగ్గర చిక్కుకుపోయిన మత్స్యకారులకు తగిన సదుపాయాలు కల్పించి వారిని సంరక్షించాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆ మత్స్యకారుల యోగ క్షేమాలను తెలుసుకుని వారి కుటుంబాలకు ధైర్యం చెప్పాల్సిందిగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నట్లు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.