యాప్నగరం

'వైసీపీ ఎమ్మెల్యేలు దాడులు చేస్తుంటే.. జనాలు భరించాలా'

Kotamreddy Sridhar Reddy| ‘మా శాసనసభ్యులు దాడులు చేస్తారు.. ప్రజలు భరించాలని చెబుతున్నారా..బాధ్యతాయుతమైన మహిళా ఉద్యోగిపై దాడి చేసిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిపై బెయిలు సులువుగా ఇచ్చే సెక్షన్లను నమోదు చేశారు.

Samayam Telugu 9 Oct 2019, 7:21 pm
వెంకటాచలం ఎంపీడీవో సరళ.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వివాదంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. కోటంరెడ్డిపై కేసు, అరెస్ట్, బెయిల్‌పై వచ్చాక కూడా ప్రతిపక్షాలు వెనక్కు తగ్గడం లేదు. ఎమ్మెల్యే విషయంలో ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉంటోందని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దీనికి ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందన్నారు. ఈ మేరకు జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది.
Samayam Telugu jagan.


వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దాడి చేసిన కేసును ప్రభుత్వం ఎందుకు నీరుగారుస్తోందని జనసేనాని ప్రశ్నించారు. ఎంపీడీవో పెట్టిన క్రిమినల్‌ కేసులను నీరుగార్చడం ద్వారా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సందేశమిస్తోందన్నారు. ‘మా శాసనసభ్యులు దాడులు చేస్తారు.. ప్రజలు భరించాలని చెబుతున్నారా..?’అంటూ ప్రశ్నించారు.

ప్రజాశ్రేయస్సు కోరి సమస్యలపై రోడ్డెక్కి ప్రతిపక్షాలు నిరసన గళం విప్పితే నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లు, 307 కింద హత్యాయత్నం కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారని అన్నారు. బాధ్యతాయుతమైన మహిళా ఉద్యోగిపై దాడి చేసిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిపై బెయిలు సులువుగా ఇచ్చే సెక్షన్లను నమోదు చేశారన్నారు. అప్పుడు ముసునూరు ఎంపీడీవో వనజాక్షిపై అప్పటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దాడి, ఇప్పుడు సరళ ఇంటిపై కోటంరెడ్డి దాడి ఒకేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.