యాప్నగరం

మంత్రి కొడాలి ఆ అంశం అసెంబ్లీలో ప్రస్తావించాలి.. లేకపోతే జనవరిలో.. : పవన్

హైదరాబాద్ దిశ ఘటనపై మంత్రులు నాని బ్రదర్స్ తెగ బాధపడిపోతున్నారు. కర్నూలులో బాలికపై అఘాయిత్యం చేసి చంపేశారు.. మంత్రులు ఈ అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలి.

Samayam Telugu 19 Feb 2020, 5:52 pm
కర్నూలుకు చెందిన 14ఏళ్ల బాలిక అత్యాచారం, హత్యకేసు అంశాన్ని మంత్రులు కొడాలి, పేర్ని నానిలు అసెంబ్లీలో ప్రస్తావించాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటనపై తమ ఆవేదనను, బాధను వ్యక్తం చేస్తున్న మంత్రులు.. బాలిక అంశాన్ని కూడా ప్రస్తావించి ఆమెకు న్యాయం చేసేలా పోరాటం చేయాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో మంత్రులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu pawan.


మంత్రులు నాని బ్రదర్స్ దిశ విషయంలో తెగ బాధపడ్డారని.. కాబట్టి ఆ ఇద్దరు సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బాలిక అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలి అన్నారు పవన్. 14 ఏళ్ల బాలికను కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో రెండేళ్ల క్రితం అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి ఉరి తీయబడింది అన్నారు. ఆమె పోస్ట్‌మార్ట్ రిపోర్టులు బయటకు తీసుకురావడం లేదని.. అసెంబ్లీ సమావేశాల్లో ఇది కూడా మాట్లాడాలి అని డిమాండ్ చేశారు.
మంత్రి కొడాలి నానికి చెబుతున్నానని.. నాని అసెంబ్లీలో కచ్చితంగా మాట్లాడాలి అన్నారు జనసేనాని. న్యాయం జరిగేలా పోరాటం చేయాలని.. ఒకవేళ మంత్రి అసెంబ్లీలో ప్రస్తావించకపోతే.. జనవరిలో కర్నూలుకు వెళ్లి.. భవన నిర్మాణ కార్మికులకు కోసం ఎలాంటి లాంగ్ మార్చ్ చేశామో.. బాలిక కోసం తాను రోడ్డు మీద జనసైనికులతో నడిచి వాళ్లకు న్యాయం జరిగే వరకూ అండగా నిలబడతాము అన్నారు.

దిశ ఘటనపై తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. దిశను చంపిన వారిని రెండు బెత్తం దెబ్బలు కొట్టాలని తాను చెప్పలేదని.. తాను తప్పుగా మాట్లాడలేదన్నారు. దోషులను బహిరంగంగా శిక్షించాలని అన్నానని.. సౌదీ అరేబియా, సింగపూర్ తరహాలో శిక్షలు ఉండాలన్నదే తన అభిప్రాయమని వ్యాఖ్యానించారు. బహింరంగంగా దోషుల కాళ్లు, చేతులను తీసేయాలన్నారు. అప్పుడే తప్పు చేయడానికి భయపడతారన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.