యాప్నగరం

రోడ్లపైకి నేనే వస్తా, ఆ పరిస్థితి రావొద్దు.. పవన్ కళ్యాణ్ సంచలన వార్నింగ్!

జగన్ ప్రభుత్వంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన కార్యకర్తలపై దాడిని ఖండిస్తూ..!

Samayam Telugu 5 Sep 2021, 10:40 pm
జగన్ ప్రభుత్వంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రోడ్ల అధ్వాన్న స్థితిని తమ పార్టీ కార్యకర్తలు వెలుగులోకి తీసుకొస్తే దాడులు చేసి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మొన్న భీమవరం, అనకాపల్లి, నేడు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో పోలీసుల సమక్షంలోనే జనసేన నాయకులపై దాడులు చేస్తున్నారని పవన్ మండిపడ్డారు.
Samayam Telugu జనసేన నేతలతో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్


సమస్యను తెలియజేసిన వారిని గాయపరచి ఎదురు కేసులు పెడతారా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అందరికీ సమన్యాయం చేయాలి కానీ, ఏకపక్షం వహిస్తే మీ వృత్తికి ద్రోహం చేసిన వాళ్లవుతారని పోలీసులకు హితవు పలికారు. ఇకపై, జనసేన కార్యకర్తలపై దాడి జరిగితే తానే స్వయంగా రోడ్ల పైకి వస్తానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఆ పరిస్థితిని తీసుకురావొద్దని పోలీసు ఉన్నతాధికారులను అభ్యర్థిస్తున్నానని తెలిపారు.


ఇక, ఆమదాలవలస దాడి ఘటనపై పవన్ కల్యాణ్ ఆరా తీశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో రహదారుల దుస్థితిపై విన్నవించిన జనసేన నేత పేడాడ రామ్మోహన్‌రావు, జనసైనికులపై వైసీపీ వర్గీయులు దాడి చేయడాన్ని పవన్ కల్యాణ్ ఖండించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులతో ఫోన్లో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పార్టీ అండగా ఉంటుందని పవన్‌ కళ్యాణ్‌ భరోసా ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.