బాక్సైట్ తవ్వకాలపై జనసేన పార్టీ ఘాటుగా స్పందించింది. బాక్సైట్ తవ్వకాలను తాము రద్దు చేశామంటే తాము చేశామని వైఎస్సార్సీపీ, టీడీపీ ఊదరగొడుతున్నాయని విమర్శించింది. ఒకవైపు బాక్సైట్ తవ్వకాలు రద్దు చేస్తూ జీవోలు జారీ చేస్తున్నామని చెబుతున్నారని, అదే కంపెనీ నుంచి విరాళాలు వసూలు చేస్తున్నారని ఆరోపించింది.
గతంలో బాక్సైట్ అక్రమ మైనింగ్ని చంద్రబాబు దగ్గరుండి ప్రోత్సహిస్తే, అదే కంపెనీని జగన్ సర్కార్ దగ్గరకి తీసుకుందని ఆరోపించారు. వంతాడలో ప్రకృతికి హాని చేస్తున్న కంపెనీ నుంచి నుంచి వైఎస్సార్సీపీ కోట్ల రూపాయలు విరాళంగా పొందిందన్నారు. నాడు చంద్రబాబు అండతో అక్రమ మైనింగ్కి పాల్పడిన అదే సంస్థ నుంచి అధికార పార్టీ విరాళాలు సేకరించినట్లు జనసేన పార్టీ ఆరోపిస్తూ ట్వీట్ చేసింది.
Also Read: అందుకే విజయసాయి ఢిల్లీలో.. టీడీపీ ఎమ్మెల్సీ ఘాటు విమర్శలు
బాక్సైట్ అక్రమ మైనింగ్కి పాల్పడుతున్న ఆండ్రూస్ కంపెనీ నుంచి అధికార పార్టీ రూ.9.5 కోట్లు విరాళంగా పుచ్చుకుందన్నారు. అదే కంపెనీకి సంబంధించిన వ్యక్తుల నుంచి మరో రూ.1.5 కోట్లు విరాళంగా వసూలు చేశారని ఆరోపించింది. బాక్సైట్ అక్రమ తవ్వకాలను రద్దు చేస్తున్నట్లు చెబుతున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదే కంపెనీ నుంచి విరాళాలు సేకరించడాన్ని తప్పుబట్టింది.
బాక్సైట్ తవ్వకాల విషయంలో టీడీపీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వాల ద్వంద్వ వైఖరి పాటిస్తున్నాయని తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పారని పార్టీవర్గాలు పేర్కొన్నాయి. ప్రకృతి సంపద దోచుకునే విషయంలో దొందూ దొందే అని ఆనాడే జనసేనాని స్పష్టం చేశారని తెలిపింది.
గతంలో బాక్సైట్ అక్రమ మైనింగ్ని చంద్రబాబు దగ్గరుండి ప్రోత్సహిస్తే, అదే కంపెనీని జగన్ సర్కార్ దగ్గరకి తీసుకుందని ఆరోపించారు. వంతాడలో ప్రకృతికి హాని చేస్తున్న కంపెనీ నుంచి నుంచి వైఎస్సార్సీపీ కోట్ల రూపాయలు విరాళంగా పొందిందన్నారు. నాడు చంద్రబాబు అండతో అక్రమ మైనింగ్కి పాల్పడిన అదే సంస్థ నుంచి అధికార పార్టీ విరాళాలు సేకరించినట్లు జనసేన పార్టీ ఆరోపిస్తూ ట్వీట్ చేసింది.
Also Read: అందుకే విజయసాయి ఢిల్లీలో.. టీడీపీ ఎమ్మెల్సీ ఘాటు విమర్శలు
బాక్సైట్ అక్రమ మైనింగ్కి పాల్పడుతున్న ఆండ్రూస్ కంపెనీ నుంచి అధికార పార్టీ రూ.9.5 కోట్లు విరాళంగా పుచ్చుకుందన్నారు. అదే కంపెనీకి సంబంధించిన వ్యక్తుల నుంచి మరో రూ.1.5 కోట్లు విరాళంగా వసూలు చేశారని ఆరోపించింది. బాక్సైట్ అక్రమ తవ్వకాలను రద్దు చేస్తున్నట్లు చెబుతున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదే కంపెనీ నుంచి విరాళాలు సేకరించడాన్ని తప్పుబట్టింది.
బాక్సైట్ తవ్వకాల విషయంలో టీడీపీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వాల ద్వంద్వ వైఖరి పాటిస్తున్నాయని తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పారని పార్టీవర్గాలు పేర్కొన్నాయి. ప్రకృతి సంపద దోచుకునే విషయంలో దొందూ దొందే అని ఆనాడే జనసేనాని స్పష్టం చేశారని తెలిపింది.