యాప్నగరం

వాళ్లను తన్నినా తప్పులేదు.. నాగబాబు షాకింగ్ కామెంట్స్

లాక్‌డౌన్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఏ పని లేకుండా రోడ్లపైకి వచ్చేవారిని చితక్కొడుతున్న పోలీసులు. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగబాబు.. వాళ్లను తన్నినా తప్పు లేదన్న జనసేన నేత.

Samayam Telugu 27 Mar 2020, 7:32 am
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. వచ్చే నెల 14 వరకు ప్రజలు కచ్చితంగా ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావొద్దని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఉదయం కొంత సమయం కేటాయించారు. ఇక సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు పూర్తి స్థాయి కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. ఇన్ని నిబంధనలు అమలు చేస్తున్నా కొందరు మాత్రం గీత దాటుతున్నారు. పనీపాటా లేకుండా రోడ్డెక్కుతున్నారు. దీంతో పోలీసులు ముందు పద్దతిగా చెప్పి చూస్తున్నారు.. కొన్నిచోట్ల మాత్రం తమ లాఠీలకు పనిచెబుతున్నారు. నాలుగు తగిలించి మరీ బుద్ది చెబుతున్నారు.. మరోసారి రోడ్డుపై కనిపిస్తే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు.
Samayam Telugu babu


Read Also: జగన్ సర్కార్‌కు పవన్ ఫుల్ సపోర్ట్.. జనసైనికులకు అలర్ట్

ఇదిలా ఉంటే పనీపాటా లేకుండా రోడ్లపైకి వచ్చే ఆకతాయిలపై జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు మండిపడ్డారు. ఓ న్యూస్ ఛానల్‌లో ఎవరో ప్రొఫెసర్ దాస్ గారు అన్నమాట తనకు చాలా నచ్చింది అన్నారు నాగబాబు. 'మనం ప్రజలకి హక్కులు నేర్పాము.. బాధ్యతలు నేర్పలేదు అక్షర సత్యం' అన్నారు. ఈ తప్పు ప్రభుత్వం వారిదే.. జనాలకి బాధ్యతలు నేర్పే టైం వచ్చింది అంటున్నారు. తాను కూడా అతితుడ్ని కాదని.. ప్రజలందరికీ తన్ని బాధ్యతలు నేర్పించండి.. నేర్చుకుంటాం అన్నారు మెగా బ్రదర్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.