యాప్నగరం

ఆ జనసేన నేత బీజేపీలోకి..? ఓ వర్గం జనసైనికులు ఫుల్ హ్యాపీస్!

Pawan Kalyan నాయకత్వంలోని జనసేన నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు. మిగతా నేతలు పార్టీ వీడినప్పుడు బాధపడిన వారు ఇప్పుడు ఈ నేత బయటకు వెళ్తారనే ప్రచారంతో ఆనందిస్తుండటం గమనార్హం.

Samayam Telugu 10 Oct 2019, 3:22 pm
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జనసేనకు చెందిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీలో లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరడానికి ఈ నేతలు ఆసక్తి చూపుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు పవన్‌కు దూరం అవుతుండటం ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. జనసేన నుంచి మరో కీలక నేత బయటకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారట. పవన్‌తో సన్నిహితంగా ఉండే ఆయన పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది.
Samayam Telugu janasena


ఆయన మరెవరో కాదు.. నాదెండ్ల మనోహర్ అనే గుసగసలు వినిపిస్తున్నాయి. ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర రావు ఇంతకు ముందే బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆయన కూడా బీజేపీలో చేరతారనే వార్తలు వెలువడుతున్నాయి.

వాస్తవానికి నాదెండ్ల మనోహర్‌కు పవన్ కళ్యాణ్ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. అనధికారికంగా ఆయన పార్టీలో నంబర్ 2గా ఉంటున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ పవన్ ఆయనకు ప్రాధాన్యం ఇచ్చారు. జనసేనాని ఇటీవల అమెరికా వెళ్లిన సమయంలోనూ మనోహర్ ఆయన పక్కనే ఉన్నారు. జనసేనలో యాక్టివ్‌గా ఉండే నేతల్లో ఆయనొకరు. అలాంటిది ఆయన పార్టీ వీడతారనే ప్రచారం జరుగుతుండటం ఆశ్చర్యపరుస్తోంది.

నాదెండ్ల నాదెండ్ల మనోహర్ తీరు పట్ల జనసేనలోని ఓ వర్గం అసంతృప్తితో ఉంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు పవన్ అధిక ప్రాధాన్యం ఇవ్వడం పట్ల కాపు నేతలు అసహనంతో ఉన్నారు. తాము ఎవరైనా పవన్‌ను కలవాలంటే నాదెండ్ల పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని.. ఎన్నికల ముందు పార్టీ టికెట్లను ఎవరికి ఇవ్వాలనేది కూడా ఆయనే డిసైడ్ చేశారని.. జనసేన పరిస్థితి ఇలా మారడానికి ఆయనే కారణమని ఇటీవలే పార్టీని వీడిన చింతల పార్థసారథి ఆరోపించారు.

Read Also: ఏపీ ప్రజల్లో ఆనందం.. తెలంగాణ వారిలో నిర్వేదం!

పవన్ మీద అభిమానంతో ఐఆర్ఎస్‌గా 13 ఏళ్ల సర్వీస్‌ను వదులుకొని మరీ జనసేనలో చేరానని.. పార్టీని వీడాల్సి వస్తుందని ఊహించలేదని చింతల పార్థసారథి ఆవేదన వెలిబుచ్చారు. పవన్ కళ్యాణ్ చుట్టూ కోటరీ ఏర్పడిందని.. ఆరోపించారు. నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేశ్‌ పేర్లను ప్రస్తావించి మరీ ఆయన ఆరోపణలు గుప్పించారు.

Read Also: జనసేనకు షాకిస్తోన్న నేతలు.. కారణం ఆ ఇద్దరేనా?నాదెండ్ల పార్టీని వీడతారనే ప్రచారాన్ని ఆయనంటే గిట్టని వర్గం ప్రచారం చేస్తుందా..? లేదంటే నిజంగానే ఆయన పార్టీ మారుతున్నారా? అనేది ఇంకొద్ది రోజులు ఆగితే తేలే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.