యాప్నగరం

అక్టోబర్ 5 నుంచి పవన్ కళ్యాణ్ యాత్ర.. రాష్ట్రమంతా టూర్!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్టోబర్ 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నట్లు పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఐటీ నిపుణలతో నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 14 Aug 2022, 3:49 pm
వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో అభివృద్ధిని మరచిందని.. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసి యువత భవిష్యత్తును నాశనం చేసిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. జనసేన పార్టీ సరికొత్త ఐటీ పాలసీతో ముందుకొస్తుందని.. అది రాష్ట్రాభివృద్ధికి, ఐటీ రంగ విస్తరణకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ మేరకు ఆదివారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఐటీ విభాగం ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల మనోహర్ పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో 600 మంది ఐటీ నిపుణులు పాల్గొన్నారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫొటో)



ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా క్రియాశీల కార్యకర్తల నమోదు కార్యక్రమం చేపట్టామన్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేసే విభాగాల్లో ఐటీ వింగ్ చాలా కీలకమని తెలిపారు. ఐటీ వింగ్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరే విధంగా పని చేయాలని సూచించారు. ఇప్పటి రాజకీయాల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

ఇక, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పెట్టుబడులు తీసుకొస్తామని, పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా జనసేన ఐటీ పాలసీ ఉంటుందని చెప్పారు. ఇక, పవన్ కళ్యాణ్ అక్టోబర్ 5వ తేదీ నుంచి యాత్ర ప్రారంభిస్తారని వెల్లడించారు. అక్టోబర్ 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటనలు ఉంటాయని ప్రకటించారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.