యాప్నగరం

పవన్ కళ్యాణ్ ‘వారాహి’ యాత్రకు రంగం సిద్ధం.. అన్ని వర్గాలను కలిసేలా పక్కా ప్లాన్!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి రానున్నారు. ఎన్నికల ప్రచార వాహనం ‘వారాహి’లో తొలిసారి రాజకీయ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 14 నుంచి ఈ పర్యటన కొనసాగుతుంది.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 6 Jun 2023, 1:01 am
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జూన్ 14వ తేదీన కత్తిపూడి జంక్షన్ నుంచి ‘వారాహి’ యాత్ర ప్రారంభిస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహార కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ మేరకు గుంటూరులో నాదెండ్ల మనోహర్ సోమవారం సాయంత్రం వారాహి యాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పత్తిపాడు నుంచి పర్యటన మొదలుపెడతారని చెప్పారు. ఈ యాత్రలో అన్ని వర్గాల ప్రజల్ని పవన్ కళ్యాణ్ కలిసేలా ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్ ‘వారాహి’ వారాహి యాత్ర


ఒక్కో నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పవన్‌ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగనుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతి రోజూ ఉదయం బస చేసిన ప్రాంతంలో స్థానిక సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని, వీటి పరిష్కారానికి అక్కడి నుంచే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తారన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. మేధావి వర్గంతో సమావేశాలు ఉంటాయని వివరించారు. వారాహి యాత్రలో భాగంగా వైసీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలను, ప్రజలకు జరిగిన నష్టాలను ప్రజలకు పవన్ కళ్యాణ్ తెలియజేస్తారని పేర్కొన్నారు.

ఇక, పోలవరం ప్రాజెక్టు.. జగననన్న పాపం పథకంగా మారిందని నాదెండ్ల మనోహర్ దుయ్యబట్టారు. డబ్బుల కోసం పోలవరం ఎత్తును తగ్గించారని పేర్కొన్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రూ. 17,140 కోట్ల నిధులను పోలవరం ప్రాజెక్టు కోసం విడుదల చేసిందని గుర్తు చేశారు. పోలవరం ఎత్తు తగ్గించారని స్వయంగా కేంద్రమే చెప్పిందన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే హడావుడిగా పోలవరం పర్యటనకు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 14 వేల‌ మంది పోలవరం నిర్వాసితులకు ఏ విధమైన న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రిటైనింగ్ వాల్ డ్యామేజీకి కారణం అవినీతా, నాణ్యతా లోపమా అనేది చెప్పాలని నాదెండ్ల మనోహర్ నిలదీశారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.