యాప్నగరం

YSRCP ఎమ్మెల్యేలకు జరిగే సన్మానం చూడాలని ఉంది.. నాగబాబు ట్వీట్

' వైఎస్సార్‌సీపీ పార్టీ ఎమ్మెల్యేలు.. వాళ్లు రూమ్స్‌లో కాకుండా ఒక్కసారి రాజధాని ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టి ఇలాంటి కామెంట్స్ చేస్తే వాళ్ళు మీకు చేసే సన్మానం కళ్లారా చూడాలని ఉంది' అంటూ నాగబాబు సెటైర్లు.

Samayam Telugu 10 Jan 2020, 12:12 pm
అమరావతిలో రైతులపై పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వస్తున్న విమర్శలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలు అవహేళనగ మాట్లాడటం మంచి పద్దతి కాదంటున్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై జనసేన నేత నాగబాబు స్పందించారు. అలాగే అమరావతిలో మహిళలు, రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని ఖండించారు.
Samayam Telugu naga


రాజధాని రైతుల మీద తప్పుడు కామెంట్స్ చేసే అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. వాళ్లు రూమ్స్‌లో కాకుండా ఒక్కసారి రాజధాని ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టి ఇలాంటి కామెంట్స్ చేస్తే వాళ్ళు మీకు చేసే సన్మానం కళ్లారా చూడాలని ఉంది అన్నారు నాగబాబు. రాజధాని రైతుల పోరాటం నిజంగా ప్రశంసనీయమని.. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరికి రైతుల పోరాటం స్ఫూర్తి దాయకమన్నారు.

రైతులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అన్నారు నాగబాబు. వాళ్ల పోరాటం వృధా పోకూడదని కోరుతున్నాను. కులం ఎప్పుడు చెడ్డది కాదు.. మనుషుల్లోనే చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు.. ఇలా కులాలమీద పగబట్టి వాళ్ళ జీవితాలతో ఆదుకోవడం ఎవరికి మంచిదికాదని వ్యాఖ్యానించారు. గుడికి వెళ్తున్న మహిళల మీద లాఠీచార్జి చేస్తున్నారని న్యూస్‌లో చెప్తున్నారని.. అదే నిజమైతే అంతకన్నా దారుణం ఇంకోటి ఉండదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.