యాప్నగరం

YS Jagan గారు ఆ పని చేయొద్దు.. నాగబాబు రిక్వెస్ట్

రాజధాని చుట్టూ తిరుగుతున్న రాజకీయం.. అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం. ప్లీజ్ జగన్ రెడ్డి గారు మీరు ఆ తప్పు చేయకండి అంటూ రిక్వెస్ట్ చేసిన జనసేన పార్ట ీనేత నాగబాబు.

Samayam Telugu 11 Jan 2020, 8:37 am
అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. రైతులు, మహిళలు రోజకో విధంగా తమ నిరసనల్ని తెలియజేస్తున్నారు. అది అలా ఉంటే ఇటు పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వస్తున్న విమర్శలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలు అవహేళనగ మాట్లాడటం మంచి పద్దతి కాదంటున్నారు. ఈ వ్యాఖ్యలు, రాజధాని విషయంలో జగన్ నిర్ణయంపై జనసేన నేత నాగబాబు స్పందించారు. అలాగే అమరావతిలో మహిళలు, రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని ఖండించారు.
Samayam Telugu nagababu.


నాగబాబు తన ట్వీట్‌లో.. యూదుల మీద పగబట్టి వాళ్ళ జాతిని నాశనం చేసిన ఆడాల్ఫ్ హిట్లేర్ కన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు అన్నారు. అలాంటి హిట్లర్ కూడా నాశనం అయిపోయాడని.. ప్లీజ్ జగన్ రెడ్డి గారు మీరు ఆ తప్పు చేయకండి అంటూ రిక్వెస్ట్ చేశారు..యు have స్టిల్ టైం టు కరెక్ట్ యువర్ hasty decision.కుక్క కాటుకి చెప్పుదెబ్బ అన్నారు.. కానీ ఇన్ని చెప్పు దెబ్బలు ఉంటాయని ఇప్పుడే తెలిసింది అన్నారు.
అంతకు ముందు కూడా నాగబాబు జగన్ సర్కార్, పోలీసుల తీరుపై మండిపడ్డారు. రాజధాని రైతుల మీద తప్పుడు కామెంట్స్ చేసే అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ల రూమ్స్‌లో కాకుండా ఒక్కసారి రాజధాని ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టి ఇలాంటి కామెంట్స్ చేస్తే వాళ్ళకు ప్రజలు చేసే సన్మానం కళ్లారా చూడాలని ఉంది అన్నారు. రాజధాని రైతుల పోరాటం నిజంగా ప్రశంసనీయమని.. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరికి రైతుల పోరాటం స్ఫూర్తి దాయకం అన్నారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని.. మీ పోరాటం వృధా పోకూడదని కోరుతున్నాను అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.