యాప్నగరం

ఆంధ్రాలో ఇంత మంది సన్నాసులున్నారా..? జనసేన సంచలనం!

ఏపీ మంత్రులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై జనసేన పార్టీ నాయకులు ఓ రేంజ్‌లో ఫైరయ్యారు.

Samayam Telugu 27 Sep 2021, 4:04 pm
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అధికార వైసీపీ నాయకులపై జనసేనాని పదునైన విమర్శలతో విరుచుకుపడిన నేపథ్యంలో ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలకు జనసేన నాయకులు తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్


ఈ మేరకు సోమవారం జనసేన నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. సినిమాను రాజకీయం చేసిందెవరు? రాజకీయాల్లోకి లాగిందెవరని ప్రశ్నించారు. సినిమాను ప్రభుత్వమే రాజకీయాల్లోకి లాగిందని.. దానిపై మాట్లాడితే, మళ్లీ రాజకీయం ఎందుకని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ప్రజాస్వామ్యంలో ఉన్న సంగతి మర్చిపోయారని, రెండున్నరేళ్లయినా.. వారిలో ఇంకా ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు.


పవన్ కళ్యాణ్‌ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సన్నాసి అంటూ దుర్భాషలాడారని.. కానీ, రాష్ట్రంలో ఇంత మంది సన్నాసులున్నారన్న సంగతి ఇప్పుడే తెలుస్తోందని జనసేన నేతలు అన్నారు. మంత్రి వెల్లంపల్లికి రాజకీయ భిక్ష పెట్టిందే పవన్ కళ్యాణ్ కుటుంబం అనే విషయం మర్చిపోయారని మండిపడ్డారు. విజయవాడ దుర్గమ్మ గుడి రథంపై ఉన్న సింహం బొమ్మను కొట్టేసిన సన్నాసి మంత్రి వెల్లంపల్లి అని సంచలన కామెంట్స్ చేశారు. అలాగే, ఏదైనా ఒక అంశంపై సంబంధిత మంత్రి మాట్లాడాలని, కానీ.. ఏపీ మాత్రం ఎవరు పడితే వారు మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు.

జనసేనాని పవన్ కళ్యాణ్ ఏ మంత్రినీ వ్యక్తిగతంగా దూషించలేదని, విమర్శలు చేయలేదన్నారు. కానీ, ఏపీ మంత్రులంతా కట్టగట్టుకుని పవన్ కళ్యాణ్‌ను దుర్భాషలాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు సంయమనం పాటించామని, ఇకనైనా మారకపోతే దుర్గమ్మ గుడి చుట్టూ తిప్పికొట్టే రోజు వస్తుందని జనసేన నేతలు హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.