యాప్నగరం

జనసేన ఎమ్మెల్యే వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణుల సంబరాలు.. పవన్ పరిస్థితి ఇదేనంటూ..

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

Samayam Telugu 24 Jun 2020, 6:28 pm
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మరోసారి వార్తల్లో నిలిచారు. ఏపీకి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రకటించి మరోసారి తీవ్ర చర్చకు తెరతీశారు. జనసేన పార్టీకి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్.. మొదటి నుంచి సొంత పార్టీకి దూరంగా ఉంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి జై కొడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన మాటలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
Samayam Telugu రాపాక వరప్రసాద్


రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపు మహిళలకు సంవత్సరానికి రూ. 24 వేలు చొప్పున ఇవ్వడం గొప్ప విషయమన్నారు. అనుకున్న దాని కంటే 6 నెలల ముందుగానే లబ్ధి చేకూరుస్తున్నారని తెలిపారు. ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన దిశగా ముఖ్యమంత్రి జగన్ విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరూ క్షేమంగా, సుభిక్షంగా ఉన్నారని స్పష్టం చేశారు.

రాబోయే కాలంలో మరిన్ని పథకాలు తీసుకొస్తారని జనసేన ఎమ్మెల్యే రాపాక చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే జగన్ నంబర్ 1 సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి శాశ్వత సీఎంగా జగనే ఉండేలా ప్రజల్లో పేరు తెచ్చుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. జనసేన ఎమ్మెల్యే రాపాక చేసిన ఈ వ్యాఖ్యలపై అధికార వైసీపీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. ఈ వార్త ప్రచురించిన పేపర్ క్లిప్పింగును షేర్ చేస్తూ.. జనసేనాని పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో జోరుచూపిస్తున్నారు. జనసేన కార్యకర్తలు మాత్రం మరోసారి రాపాకను విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.