యాప్నగరం

జగన్‌కు జనసేన ఎమ్మెల్యే జై.. వైసీపీ సభ్యుల నంబర్ మారిందంట!

వైసీపీ ప్రభుత్వానికి మరోసారి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ బాసటగా నిలిచారు. శాసన మండలి రద్దుపై సీఎం జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి రాపాక మద్దతు ప్రకటించారు.

Samayam Telugu 27 Jan 2020, 5:13 pm
వైసీపీ ప్రభుత్వానికి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి జై కొట్టారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన శాసన మండలి రద్దు తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న సదుద్దేశంతో సీఎం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాంటి వికేంద్రీకరణ బిల్లును మండలి అ డ్డుకోవడం బాధాకరమన్నారు. అలాగే ఇంగ్లిష్ మీడియం బిల్లులను సైతం మండలిలో తిరస్కరించారని చెప్పారు. ఇలాంటి సభ ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు.
Samayam Telugu rapaka


Also Read: ‘చంద్రబాబుకు 23 సంక్షోభం.. మరోసారి రిపీటైన నంబర్’

ఇంగ్లిష్ మీడియం బిల్లును టీడీపీ అసెంబ్లీలో అనుకూలంగా వ్యవహరించి, మండలిలో వ్యతిరేకించిందని రాపాక విమర్శించారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు ఈ సభలో అందరూ బాగా చదువుకున్నవారే ఉన్నారని, ఇక మరో సభ ఉండాల్సిన అవసరం లేదన్నారు. అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. మాల, మాదిగలను విడదీసింది.. చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎంతసేపటికీ బిట్రిష్ సంప్రదాయం ప్రకారం విభజించి, పాలిస్తారని విమర్శించారు.

వైసీపీకి 154 మంది సభ్యులు..
సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూస్తున్నారని ఎమ్మెల్యే రాపాక చెప్పారు. రాష్ట్రంలో సీఎం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో డ్రైన్స్, రోడ్లన్నీ బాగు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకే వైసీపీకి 151 మంది అక్కడ ఉంటే.. మరో ముగ్గురు కూడా ఆయన నిర్ణయాలకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. అంటే 154 మంది తీర్మానానికి అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు.

Also Read: మండలి ఇక గతమేనా.. రద్దు దిశగా జగన్ వడివడి అడుగులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.