యాప్నగరం

జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. చిరు-పవన్ మధ్య చిచ్చు పెట్టినట్లేనా!

మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. అమరావతిపై పవన్ నిర్ణయంతో తనకు సంబంధం లేదన్న రాపాక. పవన్ ఇంట్లోనే రెండు అభిప్రాయాలు ఉన్నప్పుడు.. పార్టీలో రెండు అభిప్రాయాలు ఉంటే తప్పంటన్న రాపాక.

Samayam Telugu 4 Jan 2020, 1:13 pm
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై పవన్ నిర్ణయంతో తనకు సంబంధం లేదన్నారు. పవన్ ఇంట్లోనే రెండు అభిప్రాయాలు ఉన్నప్పుడు.. పార్టీలో రెండు అభిప్రాయాలు ఉండటం తప్పేంటని ప్రశ్నించారు. పార్టీ అధినేతగా నిర్ణయం ఆయనదేనని.. తనకు పార్టీ కన్నా ఓట్లేసి గెలిపించిన ప్రజలే ముఖ్యమన్నారు. చిరంజీవి కూడా మూడు రాజధానులను సమర్థించారని.. పవన్ కూడా మూడు రాజధానుల్ని వ్యతిరేకించడం లేదన్నారు. ఎక్కడ పెడతారో స్పష్టం చేయమని అడుగుతున్నారన్నారు. అమరావతి భూములు లాక్కున్నప్పుడు పవన్ ఆందోళన చేశారని గుర్తు చేశారు.
Samayam Telugu vara


ఇక ప్రభుత్వాలకు అనుకూలంగా కమిటీల నివేదికలు ఉంటాయని.. హైపవర్ కమిటీ నిర్ణయం కూడా ఇలాగే ఉంటుందనుకుంటున్నాను అన్నారు రాపాక. రాజధానులతో సామాన్యులకు పని ఉండదని.. మూడు రాజధానులతో రాష్ట్రం అభివ్రుద్ధి చెందుతుందన్నారు. అంతక ముందు కూడా ఈ అంశంపై మాట్లాడిన ఎమ్మెల్యే.. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని.. విభజన తర్వాత ఏపీ క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉందన్నారు. ప్రజలకు మేలు జరుగుతుందంటే జనసేన మద్దతు ఇస్తుందన్నారు.

హైదరాబాద్‌లో నిధుల్ని ఎక్కువగా అక్కడే వెచ్చించడంతో.. ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని చెప్పుకొచ్చారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అన్నారు. రాజధాని రైతులకు అన్యాయం జరిగిందని వరప్రసాద్ వ్యాఖ్యానించారు. గతంలో బలవంతంగా రైతుల దగ్గర భూములు లాక్కున్నారని.. ప్రభుత్వ నిర్ణయంతో వారికి ఇబ్బందేనని.. అమరావతి రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక విశాఖను ఎడ్యుకేషనల్ కేపిటల్ చేయాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.