యాప్నగరం

సీఎం జగన్ ఫోటోకు జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం.. ఏంటి మ్యాటర్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోటోకు ఫాలాభిషేకం చేసిన జనసేన పార్టీ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు. పార్టీ మారబోతున్నారాంటూ జోరుగా ప్రచారం.

Samayam Telugu 18 Oct 2019, 10:15 pm
తూర్పుగోదావరి జిల్లా రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేయడం ఆసక్తిగా మారింది. మంత్రి పినిపె విశ్వరూప్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనడంతో పార్టీ మారతారంటూ ప్రచారం జరిగింది. వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరిగింది. వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని ప్రకటించినందుకు సీఎం జగన్‌ను అభినందిస్తూ ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు ర్యాలీ చేసి.. సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్, రాపాక వరప్రసాద్ హాజరయ్యారు. ఆటోడ్రైవర్లతో కలిసి సభలో పాల్గొని.. జగన్ ఫోటోకు పాలాభిషేకం చేశారు.
Samayam Telugu rapakaa


జనసేన ఎమ్మెల్యే రాపాక జగన్ ఫోటోకు పాలాభిషేకం చేయడంతో వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీంతో ఎమ్మెల్యే రాపాక స్పందించారు. ఫేస్‌బుక్ ద్వారా పార్టీ మారతారంటూ జరుగుతున్న ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. నమ్మొద్దంటూ జనసేన కార్యకర్తలతో నెటిజన్లను కోరారు.

‘నన్ను ఎంతగానో నన్ను నమ్మి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. జనసైనికులు, నా అభిమానులు, కార్యకర్తలు రాత్రీపగలూ తేడా లెకుండా కష్టపడి నా వెంటనడిచి నాగెలుపు కోసం కృషి చేశారు. ప్రజలకు మంచి చేస్తానని నను నమ్మి ప్రజలు నాకు ఓట్లు వేశారు గెలిపించారు ఇంతమంది నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత నాకు వుంది. ఎవరు ఎన్ని కుట్రలు నాపై పన్నిన అందరు వాటిని బలంగా తిప్పికొట్టండి జనసేన బలాన్ని అందరు సమిష్టిగా కాపాడండి, విమర్శ అనేదే ఎప్పుడు హుందాతనంగా ఉండాలి తప్ప వ్యక్తిగత దూషణలు వద్దు’అన్నారు రాపాక.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.