యాప్నగరం

ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు.. వాళ్ల ట్రాప్‌లో పడొద్దు, ఇదంతా మైండ్ గేమ్: జనసే పార్టీ అలర్ట్

Janasena Party పార్టీ నేతలు, కార్యకర్తల్ని అలర్ట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దంటోంది. కొద్దిరోజులుగా పొత్తులు, ప్రతిపక్ష పార్టీల నేతల పేర్లతో కొన్ని ప్రకటనటలు వస్తున్నాయని.. అదంతా ఫేక్ అంటోంది. రాజకీయ వ్యూహాలు, పొత్తులపై అధినేత నిర్ణయం తీసుకుంటారని.. దీనిపై జరిగే ప్రచారం విషయంలో జాగ్రత్తంగా ఉండాలని.. ఇదంతా మైండ్ గేమ్‌లో భాగమంటోంది. ఈ మేరకు రెండు రోజులుగా పార్టీ నేతలను అప్రమత్తం చేస్తోంది జనసేన పార్టీ.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 31 Mar 2023, 5:42 am

ప్రధానాంశాలు:

  • జనసైనికుల్ని అలర్ట్ చేసిన అధిష్టానం
  • సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మొద్దు
  • పొత్తులపై అధినేత నిర్ణయం ఫైనల్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Janasena Party  Tdp Alliance
వైఎస్సార్‌సీపీ (Ysrcp) ట్రాప్‌లో పడొద్దని జనసైనికుల్ని అప్రమత్తం చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). పొత్తుల విషయంలో జనసైనికులు డైవర్ట్ కావొద్దని.. సోషల్ మీడియాతో పాటూ బయట జరుగుతున్న ఫేక్‌ ప్రచారాన్ని నమ్మొద్దని.. జాగ్రత్తగా ఉండాలంటోంది జనసేన పార్టీ. గతంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలినవ్వం అని చెప్పారు.. అందుకే వైఎస్సార్‌సీపీ మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలనివ్వనని.. రాష్ట్ర శ్రేయస్సు, మన యువత భవితను దృష్టిలో ఉంచుకుని పవన్‌ అన్నారని గుర్తు చేసింది జనసేన.
కొద్దిరోజులుగా జనసేన పార్టీతో పాటూ విపక్ష నేతల పేర్లతో తప్పుడు ప్రకటనలతో గందరగోళం మొదలైందని.. ఇదంతా పొలిటికల్ గేమ్ అంటున్నారు. జనసైనికులు సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని.. తప్పుడు ప్రకటనలు, సమాచారం విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నిర్ణయాలు తీసుకుంటారని.. అందుకు తగ్గట్లే వ్యూహాలను ఆయన తెలియజేస్తారంటున్నారు. జనసైనికులు పొత్తులు, రాజకీయ వ్యూహాలపై అనవసరమైన ఆందోళన వద్దని సూచించారు. పొత్తులపై ఆయా రాజకీయ వేదికలపై చర్చించి నిర్ణయం ఉంటుంది అంటున్నారు.

దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని వైఎస్సార్‌సీపీ సవాల్ చేస్తోంది. జనసే పార్టీ కూడా అదే రేంజ్‌లో వారికి కౌంటర్ ఇస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా వైఎస్సార్‌సీపీ ఏం జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నారో అది తనుకు తెలుసు అని వ్యాఖ్యానించారు. కానీ వద్దనుకుంటుందే జరుగుతుందని.. వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓటు వృథా కానివ్వన ఇవటీవల జరిగిన ఆవిర్భావ సభలో మరోసారి తేల్చి చెప్పారు.

రాష్ట్రం కోసం మంచి నిర్ణయం తీసుకుంటామని.. జనసైనికులు తనను నమ్మాలన్నారు. మచిలీపట్నం సభలోనే అన్ని అంశాలపై దాదాపు క్లారిటీ ఇచ్చారు. అయితే కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జనసేన పేరుతో ఓ ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జనసేనల మధ్య పొత్తుపై రెచ్చగొట్టేలా నాయకులు చేయని వ్యాఖ్యలు చేసినట్లుగా బాగా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు లేదని.. జనసేనకు ఇచ్చే సీట్లు ఇవేనంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అచ్చెన్నాయుడు, నాగబాబు మధ్య వార్ నడుస్తోందని కొన్ని ఛానల్స్ పేరుతో హడావిడి చేస్తున్నారు. ఈ ప్రకటనలు నిజమని కొందరు జనసైనికులు భావిస్తున్నారు. దీంతో క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

ఇదంతా వైఎస్సార్‌సీపీ మైండ్‌గేమ్‌ అంటోంది జనసేన పార్టీ. వాళ్ల ట్రాప్‌లో పడొద్దని జనసైనికుల్ని అప్రమత్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతల పేరుతో తప్పుడు ప్రకటలు సృష్టించడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు పార్టీల్లో పొత్తులు, రాజకీయ వ్యూహాలు, సీట్ల అంశం అధినేత చూసుకుంటారని నేతలు అంటున్నారు. ఈ ప్రచారం విషయంలో కన్ఫ్యూజన్ వద్దని నేతలు, జనసైనికులు, వీర మహిళలకు వివరింస్తున్నారు.

Read Latest Andhra Pradesh News and Telugu News
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.