యాప్నగరం

మార్పు మొదలైంది: జనసేనకు 18% ఓట్లు, 1,000 వార్డులు.. పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన విడుదల చేశారు. పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్లు పొందామని, సీట్లు గెలుపొందామని వ్యాఖ్యానించారు.

Samayam Telugu 12 Feb 2021, 11:50 pm
తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు ఎంతగానే ప్రభావశీలంగా పని చేశారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఎన్నికల ఫలితాలు ఎంతో సంతృప్తినిచ్చాయని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు చూస్తుంటే ప్రజల్లో మార్పు మొదలైనట్లు అర్థమవుతోందని జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ మేరకు శుక్రవారం పంచాయతీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్


YSRCP గెలిచిన పంచాయతీలు ఇవే: తప్పని నిరూపించే దమ్ముందా, ప్రూఫ్స్‌తో వైసీసీ సవాల్!
తొలి విడత పంచాయతీ ఫలితాలు సంతృప్తినిచ్చాయని పవన్ పేర్కొన్నారు. జనసేన భావజాలంతో పోటీలో నిలిచి, పార్టీ శ్రేణుల మద్దతు పొందిన వారు 18 శాతానికిపైగా ఓట్లు సాధించి గణనీయంగా సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు కైవసం చేసుకున్నారని చెప్పారు. 1,000కి పైగా వార్డుల్లో విజయం సాధించామని పవన్‌ పేర్కొన్నారు. అలాగే తనకు అందించిన సమాచారం మేరకు విశ్లేషిస్తే.. 1,700 పైగా పంచాయతీల్లో రెండో స్థానం దక్కిందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ ఫలితాలను చూస్తుంటే, మార్పు మొదలైందని అర్థమైందని చెప్పారు. ఇది కచ్చితంగా మార్పునకు సంకేతమని తేల్చి చెప్పారు.

పంచాయతీల్లో 94% సీట్లు YSRCP కే: ఇంకెన్నాళ్లు గాలికబుర్లు, TDP సీట్లు ఇవే.. చంద్రబాబు సంచలనం
సాధారణంగా పంచాయతీ ఎన్నికలంటే అధికార పక్షానికి అనుకూలంగా ఉంటాయని.. అలాంటి పరిస్థితుల్లోనూ జనసేన నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా నిలబడి పోరాటం చేశారని చెప్పారు. ప్రజా సమస్యలపై జనసేన నిరంతరం పోరాడుతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.