యాప్నగరం

జనసేనలో కీలక నియామకాలు.. విద్యావేత్త, జర్నలిస్టుకు పదవులు

జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ పటిష్టత కోసం కీలక నియామకాలు చేపట్టారు.

Samayam Telugu 6 Sep 2020, 6:23 pm
టీవీ చర్చా కార్యక్రమాల్లో జనసేన పార్టీ గొంతు గట్టిగా వినిపించేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ తరఫున ఇద్దరు అధికార ప్రతినిధులను నియమిస్తున్నట్లు ఆదివారం పార్టీ ప్రకటించింది. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. టీవీ చానెల్స్ డిబేట్స్‌లో జనసేన తరఫున పాల్గొనేందుకు విద్యా కోవిదుడు కోటమరాజు శరత్ కుమార్, పాత్రికేయుడు పి.వివేక్ బాబును ప్రతినిధులుగా జనసేనాని పవన్ కళ్యాణ్ నియమించారని ఆయన పేర్కొన్నారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్


విజయవాడకు చెందిన శరత్ కుమార్ (42) ఎంటెక్, ఎల్ఎల్‌బీ, పీహెచ్‌డీ పట్టభద్రులలు. ప్రస్తుతం ఆయన అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. అలాగే కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన వివేక్ బాబు (40) విశాఖపట్నంలో స్థిరపడ్డారు. బీటెక్ చదివారు. కొంత కాలం పాటు ఓ న్యూస్ చానల్‌కు రిపోర్టర్‌గా పని చేశారు. జనసేన ప్రతినిధులుగా నియమితులైన వీరిద్దరికీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.