కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంలో జాప్యం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) . కోనసీమకు కొత్త విధానం ఎందుకని.. జిల్లా ప్రకటించిన సమయంలోనే ఈ పేరు పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పొట్టి శ్రీరాముల్ని ఒక్క జిల్లాకు పరిమితం చేసి అగౌరవపరిచనట్లేనని.. జిల్లాకు పేరు వ్యతిరేకిస్తున్నారంటే ఆ వ్యక్తుల్ని వ్యతిరేకించినట్లు కాదన్నారు. సముద్రం ఉన్న జిల్లాకు కృష్ణా జిల్లా పేరు పెట్టారని.. కృష్ణా నది ఉన్న జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారన్నారు జనసేనాని. మిగతా జిల్లాలతో పాటే కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టి ఉంటే సరిపోయేది అని అభిప్రాయపడ్డారు. అభ్యంతరాలను వ్యక్తులు మాత్రమే ఇవ్వాలనే షరతు కోనసీమలోనే ఎందుకు పెట్టారని.. మిగతా జిల్లాలకు గడువు ఇవ్వకుండా ఈ జిల్లా పేరు విషయంలోనే గడవు ఇవ్వడం గొడవల కోసం కాదా అన్నారు. భావోద్వేగాలను రెచ్చగొట్టడానికే 30 రోజుల గడవు అన్నారు. ఎమ్మెల్సీ చేసిన హత్యను కవర్ చేయడానికే ఈ కోనసీమ అల్లర్లు సృష్టించారని.. ఈ సమయంలోనే గొడవ వచ్చిందంటే కారణం ఏంటి అని ప్రశ్నించారు. అల్లర్లకు జనసేనను బాధ్యులుగా చేయడాన్ని ఖండిస్తున్నానన్నారు.
మంత్రి ఇంటిపై దాడి జరుగుతుంటే యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషించిందా అని పవన్ ప్రశ్నించారు. ఏదైనా నిరసన చేస్తున్నారంటే పోలీసులు చాలా అప్రమత్తంగా ఉంటారని.. అలాంటిది కోనసీమ జిల్లా విషయంలో పోలీసులు ఎందుకు అలర్ట్ కాలేదని అనుమానం వ్యక్తం చేశారు. ఇదంతా చాలా ప్రీ ప్లాన్డ్గా జరిగిందని.. వైఎస్సార్సీపీ (Ysrcp) ఉద్దేశం అల్లర్లు కోరుకున్నట్లు ఉందన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మంత్రులు, పోలీసులు నానా హడావిడి చేస్తారని.. అమలాపురంలో మాత్రం పోలీసుల్ని అప్రమత్తం చేయకపోవడం ముందస్తు ప్రణాళికే అని వ్యాఖ్యానించారు. కోనసీమలో చిచ్చుపెట్టింది వైఎస్సార్సీనే అని ఆరోపించారు. దాడుల్ని అడ్డుకోవడానికి అవకాశం ఉన్నా ఆ పని చేయలేదన్నారు.
కడప జిల్లాకే అంబేద్కర్ పేరు పెట్టి ఉండొచ్చు కదా అని పవన్ ప్రశ్నించారు. కులలా మీదే వైఎస్సార్సీపీ ఆట ఆడుతోందని.. కుల సమీకరణం మీదే ఏపీలో రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. అంబేద్కర్ను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని.. అంబేద్కర్ ఆశయాలను అమలు చేయాలని ఏ ప్రభుత్వం అనుకోవడం లేదన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్లో రూ.10వేల కోట్లను ఇతర అవసరాల కోసం ప్రభుత్వం మళ్లించిందన్నారు. అక్కడ ప్రజల భావోద్వేగాలు తెలిసి కూడా యంత్రాంగం స్పందించలేదని విమర్శించారు.
హోంమంత్రి జనసేన పార్టీ అల్లర్ల వెనుక ఉందన్నారని.. గతంలో ఆమె ఓ ఘటన విషయంలో తల్లి పెంపంకంలో లోపం అని వ్యాఖ్యానించారని.. రేపల్లె రైల్వే స్టేషన్ ఘటనలో కూడా తల్లి పెంపంకంలో లోపమా.. అమరావతిలో ఎస్సీల మీదే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు.. నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ను మానసికంగా వేధించడంతో చనిపోయారని ఆరోపించారు. దేశంలో దళితుల మీద దాడులు జరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీనే టాప్లో ఉందన్నారు. అసలు గతంలో జగన్పై జరిగిన కోడి కత్తి దాడి కేసు ఏమైందని ప్రశ్నించారు. యువత భావోద్వేగాలకు లోనవ్వదని.. వారి, వారి అభిప్రాయాలను చెప్పాలని హితవు పలికారు. మీ మీద మీరే దాడులు చేయించుకుని సింపతీ పొందుతున్నారు.. తునిలో రైలు బోగీలు తగలబెట్టింది వారే.. మళ్లీ పక్క పార్టీల మీద తోసేశారని విమర్శించారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)
మంత్రి ఇంటిపై దాడి జరుగుతుంటే యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషించిందా అని పవన్ ప్రశ్నించారు. ఏదైనా నిరసన చేస్తున్నారంటే పోలీసులు చాలా అప్రమత్తంగా ఉంటారని.. అలాంటిది కోనసీమ జిల్లా విషయంలో పోలీసులు ఎందుకు అలర్ట్ కాలేదని అనుమానం వ్యక్తం చేశారు. ఇదంతా చాలా ప్రీ ప్లాన్డ్గా జరిగిందని.. వైఎస్సార్సీపీ (Ysrcp) ఉద్దేశం అల్లర్లు కోరుకున్నట్లు ఉందన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మంత్రులు, పోలీసులు నానా హడావిడి చేస్తారని.. అమలాపురంలో మాత్రం పోలీసుల్ని అప్రమత్తం చేయకపోవడం ముందస్తు ప్రణాళికే అని వ్యాఖ్యానించారు. కోనసీమలో చిచ్చుపెట్టింది వైఎస్సార్సీనే అని ఆరోపించారు. దాడుల్ని అడ్డుకోవడానికి అవకాశం ఉన్నా ఆ పని చేయలేదన్నారు.
కడప జిల్లాకే అంబేద్కర్ పేరు పెట్టి ఉండొచ్చు కదా అని పవన్ ప్రశ్నించారు. కులలా మీదే వైఎస్సార్సీపీ ఆట ఆడుతోందని.. కుల సమీకరణం మీదే ఏపీలో రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. అంబేద్కర్ను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని.. అంబేద్కర్ ఆశయాలను అమలు చేయాలని ఏ ప్రభుత్వం అనుకోవడం లేదన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్లో రూ.10వేల కోట్లను ఇతర అవసరాల కోసం ప్రభుత్వం మళ్లించిందన్నారు. అక్కడ ప్రజల భావోద్వేగాలు తెలిసి కూడా యంత్రాంగం స్పందించలేదని విమర్శించారు.
హోంమంత్రి జనసేన పార్టీ అల్లర్ల వెనుక ఉందన్నారని.. గతంలో ఆమె ఓ ఘటన విషయంలో తల్లి పెంపంకంలో లోపం అని వ్యాఖ్యానించారని.. రేపల్లె రైల్వే స్టేషన్ ఘటనలో కూడా తల్లి పెంపంకంలో లోపమా.. అమరావతిలో ఎస్సీల మీదే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు.. నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ను మానసికంగా వేధించడంతో చనిపోయారని ఆరోపించారు. దేశంలో దళితుల మీద దాడులు జరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీనే టాప్లో ఉందన్నారు. అసలు గతంలో జగన్పై జరిగిన కోడి కత్తి దాడి కేసు ఏమైందని ప్రశ్నించారు. యువత భావోద్వేగాలకు లోనవ్వదని.. వారి, వారి అభిప్రాయాలను చెప్పాలని హితవు పలికారు. మీ మీద మీరే దాడులు చేయించుకుని సింపతీ పొందుతున్నారు.. తునిలో రైలు బోగీలు తగలబెట్టింది వారే.. మళ్లీ పక్క పార్టీల మీద తోసేశారని విమర్శించారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)