యాప్నగరం

ఏపీ ప్రజలు ఆ యాప్ డెవలప్ చేయోలేమో.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్

Ap Teachers New Attendance App వ్యవహారంపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. జగన్ సర్కార్‌పై కార్టూన్‌తో సెటైర్లు పేల్చారు. ఏపీ ప్రజలు కూడా ఓ యాప్ డెవలప్ చేయాలంటూ ట్వీట్.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 18 Aug 2022, 6:24 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Pawan Kalyan
ఏపీలో ప్రభుత్వ టీచర్లకు యాప్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయులు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా హాజరు నమోదు చేయడంపై అసంతృప్తితో ఉన్నారు. సాంకేతిక సమస్యలు, నెట్‌వర్క్ ఇబ్బందులతో కష్టాలు పడుతున్నారు. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నాయి.. యాప్ పేరుతో టీచర్లను వదిలించుకునే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉంటే ఈ యాప్ సమస్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ట్వీట్ చేశారు. వైఎస్సార్‌సీపీ (YSRCP) ప్రభుత్వం బలవంతంగా టీచర్లను ట్రాక్ చేసేందుకు యాప్ డౌన్‌లోన్ చేయించింది అన్నారు.దీనిని ఉపాధ్యాయుల బాధ్యతగా భావిస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని.. మరి అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసే పనుల్ని ట్రాక్ చేసేందుకు జనాలు కూడా ఓ యాప్ డెవలప్ చేయాలన్నారు. అకౌంటబిలిటీ ఒక్కటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఏకైక మార్గం అన్నారు.
అంతేకాదు జగన్ సర్కార్‌పై కార్టూన్‌తో సెటైర్లు పేల్చారు పవన్ కళ్యాణ్. 'పాపం రాగానే పిల్లలకు పాఠాలు చెప్పుకునేటోళ్లు, అదేదో యాప్ అంట, దాని సిగ్నల కోసం చెట్టుకొకరు, పుట్టకొకరై అట్టా తిరుగుతున్నార్ సార్. ప్రభుత్వ ఉపాధ్యాయులను వదిలించుకునే దిశలో జగన్ సర్కార్' అంటూ కార్టూన్ ద్వారా ప్రభుత్వాన్ని విమర్శించారు.

స్కూళ్లకు ప్రైవేటు సంస్థలకు అప్పగించడమే వైఎస్సార్‌సీపీ ఆలోచన అని, అందులో భాగంగానే వేధింపులు మొదలయ్యాయి అన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసి వదిలించుకొనే కుట్ర మొదలైందని.. ఉపాధ్యాయుల హాజరుకు సంబంధించి ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అని గందరగోళపరుస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఇంటి గడప దాటి సచివాలయానికి వెళ్లని సీఎం జగన్ కూడా హాజరు గురించి చెబుతున్నారని సెటైర్లు పేల్చారు. టీచర్లను వదిలించుకుని, ప్రభుత్వ పాఠశాలలు బైజూస్ లాంటి ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ఆలోచన చేస్తోందన్నారు. అందుకే సంస్కరణలు, సాంకేతికత వినియోగం లాంటి ముసుగు వేస్తోందని టార్గెట్ చేశారు. టీచర్లను బోధనకు దూరం చేసి, హాజరు పేరుతో బలవంతంగా సెలవులు పెట్టించి ప్రజలకు శుత్రువులుగా చూపించాలని చూస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తున్నారనే ప్రభుత్వం వేధిస్తోంది అన్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.