యాప్నగరం

గుడివాడకు పవన్ సడన్ టూర్.. డోకిపర్రు వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

డోకిపర్రులో కలియుగ దైవం శ్రీ భూసమేత వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.. ప్రత్యేక పూజలు చేశారు. శనివారం నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.

Samayam Telugu 12 Dec 2020, 12:30 pm
కృష్ణా జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. గుడివాడ నియోజకవర్గంలోని డోకిపర్రు వెళ్లారు. కలియుగ దైవం శ్రీ భూసమేత వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.. ప్రత్యేక పూజలు చేశారు. డోకిపర్రులో శ్రీ భూసమేత శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభంకాగా.. శనివారం నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అంతక ముందు పవన్ హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో గన్నవరం వచ్చారు. అక్కడి నుంచి గుడ్లవల్లేరు మీదుగా డోకిపర్రు చేరుకున్నారు. పవన్ వెంట జనసేన పార్టీ ముఖ్య నేతలు కూడా ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.