యాప్నగరం

వాళ్లను వదిలేది లేదంటున్న పవన్ కళ్యాణ్

జనసేన పార్టీలో ఉన్నామని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై చర్యలకు సిద్ధమైన జనసేన పార్టీ. క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధమైన పార్టీ లీగల్ సెల్.

Samayam Telugu 26 Feb 2020, 6:13 pm
జనసేన పార్టీకి నమ్మక ద్రోహం చేసి అమ్ముడుపోయిన వారిని వదిలేది లేదంటోంది జనసేన పార్టీ. గతంలో పార్టీలో ఉండి.. పక్క పార్టీలకు అమ్మడుపోయి.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. గతంలో పార్టీలో ఉండి.. ఆపై ఇతర పార్టీలకు అమ్ముడుపోయి ఇప్పటికీ పార్టీలో ఉన్నామని చెప్పుకొంటూకొందరు సామాజిక మాధ్యమాలలో పార్టీని, పార్టీ విధానాలను, ముఖ్య నాయకులను, కార్యనిర్వాహకులను కించపరుస్తున్నారని మండిపడ్డారు.
Samayam Telugu pawan


Read Also: వివాదాలు లేకుండా.. జగన్ సర్కార్‌కు పవన్ రిక్వెస్ట్

సామాజిక మాధ్యమాలలో ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్న విషయం పార్టీ దృష్టికి చేరిందని.. పార్టీ సిద్ధాంతాలపై గౌరవంగానీ, అధ్యక్షుల వారిపై అభిమానంగానీ లేనివారే ఈ తరహా వ్యాఖ్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. దురుద్దేశపూర్వకంగానే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని.. ఇటువంటి వారినిఉపేక్షించకూడదని పార్టీ లీగల్‌ సెల్‌ నిర్ణయించింది అని ప్రకటనలో తెలియజేశారు.

రెండు మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో లైవ్‌ వీడియోలు పెడుతూ, ఫేస్‌ బుక్‌, వాట్సప్‌‌లలో పోస్టులు పెడుతూ దుష్పచారం చేస్తున్న విషయం లీగల్‌ సెల్‌ గుర్తించిందని జనసేన పార్టీ తెలియజేసింది. ఈ విధమైన తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు అవసరమైన ప్రక్రియను చేపడతామని.. ముందుగా లీగల్‌ నోటీసులు జారీ చేసి, తదుపరి క్రిమినల్‌ కేసులు పెట్టాలని నిర్ణయించామంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.