యాప్నగరం

ప.గో: పోలీస్ స్టేషన్‌లో జనసేన పార్టీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

తాడేపల్లిగూడెంకు చెందిన జనసేన పార్టీ కార్యకర్త లోకేష్ నాయుడు పోలీస్ స్టేషన్‌లోనే పురుగల మందు తాగాడు. అతడ్ని వెంటనే పోలీసులు ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Samayam Telugu 21 May 2020, 12:02 pm
పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన కార్యకర్త ఆత్మహత్యాయత్నం కలకలంరేపింది. తాడేపల్లిగూడెంకు చెందిన జనసేన పార్టీ కార్యకర్త లోకేష్ నాయుడు పోలీస్ స్టేషన్‌లోనే పురుగల మందు తాగాడు. అతడ్ని వెంటనే పోలీసులు ఏరియా ఆస్పత్రికి తరలించారు.ఈ ఆస్పత్రి రెడ్ జోన్ పరిధిలో ఉండడంతో.. మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. కానీ అధికారులు మాత్రం అంగీకరించడం లేదు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
Samayam Telugu జనసేన కార్యకర్త


తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తనను వేధిస్తున్నారని లోకేష్ నాయుడు ఆరోపణలు చేస్తున్నారు. తనపై తప్పుడు కేసులు బనాయించారనే మనస్తాపంతో ఉన్నాడని.. కొద్దిరోజులుగా మానసికంగా ఒత్తిడితో ఉన్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ కారణంతోనే పోలీస్ స్టేషన్‌లో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేశాడంటున్నారు. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించాల్సి ఉంది. మరోవైపు లోకేష్ ఆత్మహత్యాయత్నం గురించి తెలియడంతో స్థానిక జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు అతడ్ని పరామర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.