యాప్నగరం

మా అన్నయ్య చిరంజీవి తప్ప అందరూ.. నాగబాబు ట్వీట్‌తో మరో దుమారం

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలకు ప్రధాని మోదీ హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరుకాకపోవడంపై సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా ప్రచారం జరిగింది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 7 Jul 2022, 6:48 am

ప్రధానాంశాలు:

  • మెగా బ్రదర్ నాగబాబు ట్వీట్‌తో దుమారం
  • సోదరుడు చిరంజీవి తప్ప అందరూ అంటూ
  • నాగబాబు ట్వీట్‌పై దుమారం రేగుతోంది
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu చిరంజీవి, నాగబాబు (File Photo)
భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ (Pm Modi) హాజరైన సంగతి తెలిసిందే. అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, మంత్రులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూరంగా ఉండటంపై ఊహాగానాలు వినిపించాయి.
ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ (BJP) అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) స్పందించారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విడుదల చేసిన వీడియో సందేశమే.. ఆయనపై వస్తున్న విమర్శలకు సమాధానమని తేల్చి చెప్పారు. జనసేన శ్రేణులు ప్రధాని సభను జయప్రదం చేయాలని పవన్ పిలుపునిచ్చారని.. భీమవరం ఈ కార్యక్రమంతో రాజకీయాలకి సంబంధం లేదన్నారు. జనసేన పార్టీ బీజేపీకి మిత్రపక్షంగా కొనసాగుతోందని.. అందులో ఎలాంటి అనుమానం, సందేహం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసే పోటీ చేస్తాయని చెప్పారు.

ఇప్పుడు తాజాగా ప్రధాని మోదీ పాల్గొన్న సభపై జనసేన పార్టీ నేత, మెగా బ్రదర్ నాగబాబు (Konidela Nagababu) ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మన్యం వీరుడు "అల్లూరి సీతారామరాజు" విగ్రహావిష్కరణ భీమవరంలో అద్భుతంగా జరిగింది, ఆ మహానుభావుడికి నా నివాళి. ఆ సభ లో మా అన్నయ్య చిరంజీవి గారు తప్ప అందరూ అద్భుతంగా పెరఫార్మెన్సు చేశారు,,. ఆ మహనటులంంరికి ఇదే నా అభినందనలు’అంటూ సెటైర్లు పేల్చారు.
నాగబాబు ట్వీట్‌పై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్వీట్‌లు అవసరమా అంటూ మెగా బ్రదర్‌ తీరును తప్పుబడుతున్నారు. అసలు ఎవరి గురించి కామెంట్ చేశారనే అనుమానాలు వ్యక్తం చేశారు. మొత్తానికి నాగబాబు చేసిన ట్వీట్‌తో మరో దుమారం రేగిందనే చెప్పాలి.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.