యాప్నగరం

ఈసారి జగన్ సర్కార్‌ను టార్గెట్ చేసిన నాగబాబు

తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆస్తుల్ని కాపాడే బాధ్యత తిరుపతి పాలకమండలిది. స్వామి వారి భూములను అమ్మే హక్కు మీకు లేదు. హిందువుల మనోభావాలని దెబ్బ తీయకండి అంటూ ట్వీట్.

Samayam Telugu 25 May 2020, 10:54 am
ట్విట్టర్‌లో దూకుడు పెంచారు జనసేన పార్టీ నేత, మెగా బ్రదర్ నాగబాబు. తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడూ స్పందిస్తున్నారు.. ఈ క్రమంలోనే గాడ్సే‌పై చేసిన ట్వీట్‌లతో పెద్ద దుమారాన్నే రేపాయి. తాజాగా జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ నాగబాబు ట్వీట్ చేశారు. వెంకన్న భూములు అమ్మాలంటూ టీటీడీ తీసుకున్న నిర్ణయంపై ఆసక్తికరంగా స్పందించారు.. తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.
Samayam Telugu నాగబాబు


తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆస్తుల్ని కాపాడే బాధ్యత తిరుపతి పాలకమండలిది అన్నారు నాగబాబు. అంతే కాని స్వామి వారి భూములను అమ్మే హక్కు మీకు లేదని.. హిందువుల మనోభావాలని దెబ్బ తీయకండి.. నిర్ణయాలని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కచ్చితంగా ఈ విషయాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాను అన్నారు.
గతంలో గాడ్సే గురించి చేసిన ట్వీట్ దుమారం రేపింది. గాడ్సేను పొగుడుతూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. తర్వాత ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.. ఈ వివాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. వ్యక్తిగతమైన వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదన్నారు.

Please Vote: పోల్: జగన్ ఏడాది పాలన ఎలా ఉంది?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.