యాప్నగరం

డియర్ జగన్‌రెడ్డి గారూ ప్లీజ్.. నాగబాబు స్పెషల్ రిక్వెస్ట్

డియర్ జగన్‌రెడ్డి గారూ ప్లీజ్ అంటూ ఏపీ ముఖ్యమంత్రికి స్పెషల్ రిక్వెస్ట్ చేశారు జనసేన పార్టీ నేత నాగబాబు. అమరావతి అంశాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర ట్వీట్లు చేశారు. తప్పులులు సరిదిద్దుకోవాలని సూచించారు.. ఎమ్మెల్యేలను కంట్రోల్‌లో పెట్టుకోవాలని.. 'కనీసం మీ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిలా ఉండడానికి ప్రయత్నించండి' అన్నారు.

Samayam Telugu 18 Jan 2020, 12:08 pm
డియర్ జగన్‌రెడ్డి గారూ ప్లీజ్ అంటూ ఏపీ ముఖ్యమంత్రికి స్పెషల్ రిక్వెస్ట్ చేశారు జనసేన పార్టీ నేత నాగబాబు. అమరావతి అంశాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర ట్వీట్లు చేశారు. తప్పులులు సరిదిద్దుకోవాలని సూచించారు.. ఎమ్మెల్యేలను కంట్రోల్‌లో పెట్టుకోవాలని.. 'కనీసం మీ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిలా ఉండడానికి ప్రయత్నించండి' అన్నారు.
Samayam Telugu janasena party leader nagababu interesting tweets and special request to ap cm ys jagan
డియర్ జగన్‌రెడ్డి గారూ ప్లీజ్.. నాగబాబు స్పెషల్ రిక్వెస్ట్


గందరగోళంలో పడేయొద్దు..

నాగబాబు తన ట్వీట్స్‌లో.. డియర్ జగన్ రెడ్డిగారు.. ఇది నా రిక్వెస్ట్.. ప్లీజ్ మీ తప్పుల్ని సరిద్దుకోండి. వచ్చే నాలుగున్నరేళ్లు పాలన కొనసాగించాలి అన్నారు.. అలాగే 151మంది ఎమ్మెల్యేల బలం ఉందని గుర్తు చేశారు. 'మీరు సుపరిపాలన అందించాలనుకుంటే.. రాష్ట్రాన్ని గందరగోళంలో పడేయొద్దు.. మీరు గందరగోళపడొద్దు.. ఇది తన రిక్వెస్ట్ అన్నారు మెగా బ్రదర్.

Twitter-Dear jagan reddy garu.its my simple request ..Plz ...

మీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయండి..

‘ఇప్పటికీ మీకు (జగన్) తప్పుల్ని సరిచేసుకునేందుకు సమయం ఉంది. మీరు తప్పులు చేయాలని మేము అనుకోము.. వాటి నుంచి మేము ప్రయోజనాలు పొందాలి అనుకోము.. జనసేన పార్టీకి అలాంటి ఆలోచనలు చేయదు. మీ ఎమ్మెల్యేలను మీరు కంట్రోల్ చేసుకోండి.. వారు మీ విజయాన్ని నాశనం చేస్తున్నారు’అంటూ మరో ట్వీట్ చేశారు.

మీ నాన్నలా ఉండటానికి ప్రయత్నించండి

‘మిమ్మల్ని, మీ నిర్ణయాలను విమర్శించే అవకాశాన్ని మాకు ఇవ్వొద్దు. మీరు దీన్ని మావైపు నుంచి వచ్చిన ఓ సలహాగా, ఛాలెంజ్‌గా తీసుకోండి. ప్లీజ్ మీరు ఏపీ ప్రజలందర్ని ఒకే విధంగా చూడండి.. పరిపాలించండి. కనీసం మీ నాన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డిగారిలో ఉండటానికి ప్రయత్నించండి’ అన్నారు జనసేన పార్టీ నేత నాగబాబు.

జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తున్న నాగబాబు

గత కొద్దిరోజులుగా నాగబాబు ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తున్నారు. అమరావతి రైతుల ఆందోళనలు, కాకినాడలో జనసేన పార్టీ నేతలపై దాడి జరిగిందంటూ స్పందిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల తీరుపై మండిపడ్డారు. అలాగే జనసేన-బీజేపీ పొత్తుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.