యాప్నగరం

Pawan Kalyanకు మళ్లీ షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే.. జగన్‌ సర్కార్ నిర్ణయానికి మద్దతు

మూడు రాజధానుల నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. ఓవైపు పవన్ కళ్యాణ్ అమరావతి రైతులకు అండగా ఉంటే.. ఈయన మాత్రం మూడు రాజధానులకు జైకొట్టారు.

Samayam Telugu 4 Jan 2020, 9:41 am
జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓవైపు అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి రైతులకు అండగా నిలిచి.. మూడు రాజధానుల్ని పరోక్షంగా వ్యతిరేకిస్తుంటే.. ఎమ్మెల్యే మాత్రం ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా మాట్లాడారు. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే.. రాజధానికి సంబంధించిన అంశాలు, తాజా పరిణామాలపై స్పందించారు.
Samayam Telugu pk.


రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు సబబే అన్నారు రాపాక. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని.. విభజన తర్వాత ఏపీ క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉందన్నారు. ప్రజలకు మేలు జరుగుతుందంటే జనసేన మద్దతు ఇస్తుందన్నారు. నిధుల్ని ఎక్కువగా అక్కడే వెచ్చించడంతో.. ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని చెప్పుకొచ్చారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అన్నారు.

రాజధాని రైతులకు అన్యాయం జరిగిందని వరప్రసాద్ వ్యాఖ్యానించారు. గతంలో బలవంతంగా రైతుల దగ్గర భూములు లాక్కున్నారని.. ప్రభుత్వ నిర్ణయంతో వారికి ఇబ్బందేనని.. అమరావతి రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక విశాఖను ఎడ్యుకేషనల్ కేపిటల్ చేయాలని కోరారు. రాపాక చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.