యాప్నగరం

జనసేన ఎమ్మెల్యే రాపాక ఊహించని ట్విస్ట్.. జగన్ సమక్షంలో కొడుకుకు లైన్ క్లియర్!

జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడు.. సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు.

Samayam Telugu 4 Dec 2020, 8:42 pm
జనసేన పార్టీ రెబల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తాను కాకుండా తన కుమారుడికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా కప్పించారు. రాపాక వరప్రసాద్ కుమారుడు రాపాక వెంకట్‌ రామ్‌ శుక్రవారం వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్వయంగా కండువా కప్పి వెంకట్ రామ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ కూడా పాల్గొన్నారు.
Samayam Telugu వైసీపీలోకి రాపాక కుమారుడు వెంకట్ రామ్


కాగా, జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే.. రాపాక వరప్రసాదరావు! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయినా రాపాక మాత్రం తూర్పు గోదావరి జిల్లా రోజోలు నుంచి గెలిచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గెలిచిన తర్వాత వైసీపీలో చేరుతారా అంటే, ఆ పార్టీలో చేరి 152 నంబర్ కావాలని అనుకోవట్లేదని.. జనసేనలో నంబర్ 1గా ఉంటానని గొప్పలు చెప్పారు. కానీ, ఈ మాట తప్పడానికి మాత్రం ఎంతో సమయం తీసుకోలేదు. కొద్ది రోజులకే వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నట్లు అసెంబ్లీలోనే ప్రకటించి సంచలనం రేపారు.

అప్పటి నుంచి జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా రాపాక వరప్రసాద్ గళం విప్పుతున్నారు. గురువారం అసెంబ్లీలో సైతం తాను బతికున్నంత వరకు జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని రాపాక చెప్పడం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ తరుణంలోనే శుక్రవారం ఏకంగా కుమారుడిని వైసీపీలో చేర్పించి మరోసారి చర్చనీయాంశమయ్యారు. సాంకేతి కారణాల వల్ల ఎమ్మెల్యేగా ఉండి, తాను వైసీపీలో చేరకుండా వ్యూహాత్మకంగా కుమారుడిని జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.