యాప్నగరం

AP Assemblyలో ఆసక్తికర సీన్.. జగన్‌ పక్కన కూర్చున్న జనసేన ఎమ్మెల్యే

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పక్కన కూర్చున్న జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. జగన్‌తో కొద్దిసేపు ముచ్చటించిన రాపాక.

Samayam Telugu 20 Jan 2020, 3:32 pm
ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు తొలిరోజు ఆసక్తికర సన్నివేశం కనిపించింది. జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పక్కన కూర్చున్నారు. కొద్దిసేపు సీఎంతో మాట్లాడారు.. ఇద్దరూ సీరియస్‌గా ఏదో చర్చించినట్లు కనిపించింది. సభ జరుగుతున్న సమయంలో జరిగిన ఈ సన్నివేశం చర్చనీయాంశమయ్యింది. సీఎంతో ముచ్చటించిన తర్వాత మళ్లీ వెళ్లి.. ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తన స్థానంలో కూర్చున్నారు.
Samayam Telugu rapaka.


Read Also: అమరావతి రైతులకు జగన్ సర్కార్ వరాలు

ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు పలికారు. అసెంబ్లీకి బిల్లు వస్తే అనుకూలంగా ఓటు వేస్తానని చెప్పుకొచ్చారు. ఆయన నిర్ణయం అలా ఉంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేకు షాకిచ్చారు.. ఆయనకు లేఖ రాశారు. ఆ లేఖలో.. రాజధాని నిర్మాణం అమరావతిలోనే కొనసాగాలని, ప్రభుత్వ పాలన సంపూర్ణముగా అమరావతి నుంచే కొనసాగాలని, అభివృద్ధి వికేంద్రీకరణ బరగాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలని జనసేన పార్టీలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది అన్నారు.

జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎమ్మెల్యే రాపాక శాసనసభ సమావేశాలకు హాజరై.. ఏపీ అసెంబ్లీలో ఏపీ డిసెంట్రలైజేషన్‌ అండ్‌ ఈక్వల్‌ డెవలప్‌మెంట్ రీజియన్‌ యాక్ట్‌ 2020, అమరావతి మెట్రో డెవలప్‌మెంట్ యాక్ట్ 2020 బిల్లుల్ని ప్రవేశపెట్టే సమయంలో.. ఓటింగ్ సమయంలో వ్యతిరేకించవలసిందిగా కోరుతున్నాను అన్నారు. మరి అసెంబ్లీలో ఎమ్మెల్యే రాపాక బిల్లకు మద్దతుగా ఓటు వేస్తారా.. పార్టీ అభిప్రాయాన్ని గౌరవిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.