యాప్నగరం

Pawan Kalyan సీఎం కాగానే.. తిరుమల, టీటీడీపై నాగబాబు కీలక వ్యాఖ్యలు

Nagababu On Tirumala Assets తిరుమల ఆలయం, టీటీడీకి సంబంధించిన ఆస్తులపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇటీవల పరిణామాలను ప్రస్తావించారు.. తిరుమల శ్రీవారికి నిత్యం కోట్లాది రూపాయలు కానుకల రూపంలో వస్తున్నాయని గుర్తు చేశారు. ఆ ఆదాయానికి అసలు లెక్కలు లేవని.. ఆస్తులన్నీ ఏమవుతున్నాయని ప్రశ్నించారు. తిరుమల కొండపై గంజాయి, గుట్కా, మద్యం వంటివి విక్రయించడం దారుణమన్నారు. వాటిటని అరికట్టే ప్రయత్నాలు జరగడం లేదని.. నిర్లక్ష్యంతో చేతులు దులుపుకుంటున్నారన్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 5 May 2023, 2:11 pm

ప్రధానాంశాలు:

  • తిరుమలలో పరిణామాలపై నాగబాబు
  • టీటీడీ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి
  • టీటీడీ స్వయంప్రతిపత్తి ఏమైందని ప్రశ్న
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Nagababu
టీటీడీ (TTD), తిరుమల ఆలయాని (Tirumala Temple)కి చెందిన ఆస్తుల్ని దోచుకుంటున్నారని ఆరోపించారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు. కాగితాలకే పరిమితమైన స్వయం ప్రతిపత్తి గురించి బహిరంగ చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. . తిరుమల పుణ్య క్షేత్రానికి చెందిన ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయంటూ ఈ మేరకు పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
'ప్రభుత్వాలు మారినప్పుడల్లా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ వ్యవహారాలలో ఆయా పార్టీల నాయకుల అజమాయిషీ పెరగడం, తమ ప్రభుత్వమే అనే ధీమాతో ఐదేళ్ల పాలనలో అందినంత సొమ్ములు దోచుకోవడం అనాదిగా చూస్తూనే ఉన్నాం. కానుకల రూపంలో ప్రతీ రోజు వస్తున్న కోట్లాది రూపాయల ఆదాయంపై లెక్కా పత్రం లేకుండా పోతోంది. ఎన్నో శతాబ్దాల ప్రఖ్యాతి గాంచిన తిరుమల పుణ్య క్షేత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక ఎకరాల భూములు, టన్నుల కొద్దీ బంగారం, ఇతర ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి. గంజాయి, సిగరెట్‌, గుట్కా, మద్యం లాంటివి తిరుమల కొండపై యధేచ్చగా విక్రయించడం ఆలయ
ధర్మానికి విరుద్ధం. కొండపై మాదక ద్రవ్యాలు దొరికినప్పుడల్లా నిర్లక్ష్యంతో చేతులు దులుపుకుంటున్నారు తప్ప వాటిని అరికట్టే విషయంలో లోపం కనబడుతోంది' అన్నారు.

'విభిన్న రకాల ధార్మిక సంస్థలు దాదాపుగా ఆయా సంస్థల స్వయం ప్రతిపత్తితోనే నిర్వహించబడతాయి. హిందూ మతానికి చెందిన దేవాలయాలు, ధార్మిక సంస్థలు చాలా వరకు దేవాదాయ శాఖ పరిధిలో నిర్వహించబడుతున్న కారణంగా కొన్ని సందర్భాల్లో హిందూ విద్వేషకులు మదమెక్కి హిందూ దేవాలయాలపై దౌర్జన్యం ప్రదర్శిస్తున్నారు. దీని వలన కొంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం స్వయం ప్రతిపత్తి అనేది కాగితాలకే పరిమితమైంది తప్ప ఆచరణలో ఆ ఊసే కనిపించడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం స్వయం ప్రతిపత్తి పాలన గురించి బహిరంగ చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది' అని అభిప్రాయపడ్డారు.
'తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో ఖచ్చితమైన జవాబుదారీతనం ఉండాల్సిందే ఎన్నో వేల సంవత్సరాలుగా అనేక రకాల దాడులను ఎదుర్కోంటూ స్వతంత్రగా, సజీవంగా నిలబడిన సనాతన ధర్మంను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడికి ఉన్నది. జనసేన ప్రభుత్వ పాలనలో పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రిగా టీటీడీ ధర్మకర్తల మండలి, హిందూ ధార్మిక సంస్థలు, అత్యధిక మంది భక్తుల అభిప్రాయాలను సేకరిస్తాం. స్వయంపాలన అన్నదే విభిన్న వర్గాల అభిప్రాయం అయితే ఇంతకాలం కాగితాలకే పరిమితమైన స్వయం ప్రతిపత్తి అనేది ఎలా ఉంటుందో ఆచరణలో చేసి చూపిస్తాం' అన్నారు నాగబాబు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.