యాప్నగరం

చరిత్రలో ఇది మొదటిసారి.. ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఇంకేం కావాలి: నాగబాబు

Konidela Nagababu ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇటీవల ఉద్యోగ సంఘ నేతలు గవర్నర్‌ను కలవడంపై స్పందించారు. చరిత్రలో మొదటిసారిగా ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని.. ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఇంకేం కావాలి అన్నారు. ఉద్యోగులు ఆఖరికి గవర్నర్‌కు మొర పెట్టుకునే పరిస్థతికి తీసుకొచ్చారన్నారు. ఉద్యోగసంఘాల నేతలు గవర్నర్‌ను కలిసి వేతనాలు సకాలంలో అందడం లేదని ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఉద్యోగుల అనుమతి లేకుండా జీపీఎస్‌ను విత్‌డ్రా చేశారని ప్రధానంగా ఆరోపించారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 21 Jan 2023, 7:31 am

ప్రధానాంశాలు:

  • గవర్నర్‌ను కలిసిన ఉద్యోగ సంఘ నేతలు
  • ట్విట్టర్ వేదికగా స్పందించిన నాగబాబు
  • చరిత్రలో మొదటిసారి అంటూ విమర్శలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Konidela Nagababu
జగన్ సర్కార్‌‌ను టార్గెట్ చేశారు జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు, మెగా బ్రదర్ నాగబాబు. చరిత్రలో తొలిసారి ఇలా జరిగిందంటూ ట్వీట్ చేశారు. 'చరిత్రలో మొదటిసారిగా ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఉద్యోగ సంఘాలు. డీఏ, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, రిటైర్మెంట్ ప్రయోజనాలందక, ఆందోళన చేయడానికి అనుమతివ్వక, ఆర్టికల్ 309 ప్రకారం ఉద్యోగ వ్యవస్థపై ప్రత్యక్ష సంబంధాలు, అధికారాలున్న గవర్నర్ కు మొర పెట్టుకునే స్థితికి తీసుకొచ్చారు. వై.సీ.పీ. అసమర్థత పరిపాలనకు ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఇంకేం కావాలి?' అన్నారు.
మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులంతా నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. తమకు సకాలంలో వేతనాలు అందడం లేదని.. తాము బాగా ఇబ్బంది పడుతున్నామన్నారు.
ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటినే వేతనాలు ఇవ్వాలని.. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉద్యోగ సంఘ నేతలు ఆరోపించారు. అలాగే ఉద్యోగుల అనుమతి లేకుండా జీపీఎస్‌ను విత్‌డ్రా చేశారని.. 90 వేల మంది ఉద్యోగుల ఖాతాల నుంచి డబ్బులు తీసుకున్నారన్నారు. అయితే తాము ఈ అంశంపై ప్రశ్నిస్తే.. సాంకేతిక సమస్య వల్ల జరిగిందని అధికారులు చెబుతున్నారన్నారు. అన్ని విషయాలు గవర్నర్‌కు చెప్పామని.. సానుకూలంగా విన్నారన్నారు. తమకు న్యాయం చేస్తామని చెప్పారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో అవమానకర రీతిలో వ్యవహరిస్తోందన్నారు నేతలు. తాము ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులు, మంత్రివర్గ పసంఘానికి సమస్యలు చెప్పామని.. వారు స్పందించకపోవడంతోనే గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశామన్నారు. బకాయిల చెల్లింపులపై జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరామన్నారు నేతలు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.